ఆ సీడీలను ప్రసారం చేయొద్దు.. రాసలీలల సీడీలపై కోర్టుకెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు

కర్ణాటకలో వీడియో సీడీలు రాజేసిన వివాదం అంతా ఇంతా కాదు. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు వీడియో సీడీలంటేనే అక్కడి నేతలు వణికిపోతున్నారు. ఏవైనా సీడీలు ఉంటే అవి టీవీలు, పత్రికల్లో ప్రసారం కాకుండా చూడాలంటూ మంత్రులు ఏకంగా బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్లను వేశారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలుపుతూ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. ఇటీవల జలవనరుల మంత్రి రమేశ్‌ జార్కిహొళి అశ్లీల వీడియో బయటకు రావడం, ఆయన పదవి పోవడం తెలిసిందే. Also […]

Written By: Srinivas, Updated On : March 7, 2021 3:12 pm
Follow us on


కర్ణాటకలో వీడియో సీడీలు రాజేసిన వివాదం అంతా ఇంతా కాదు. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు వీడియో సీడీలంటేనే అక్కడి నేతలు వణికిపోతున్నారు. ఏవైనా సీడీలు ఉంటే అవి టీవీలు, పత్రికల్లో ప్రసారం కాకుండా చూడాలంటూ మంత్రులు ఏకంగా బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్లను వేశారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలుపుతూ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. ఇటీవల జలవనరుల మంత్రి రమేశ్‌ జార్కిహొళి అశ్లీల వీడియో బయటకు రావడం, ఆయన పదవి పోవడం తెలిసిందే.

Also Read: దీదీ వర్సెస్ సువెందు : నంద్రిగ్రామ్‌ వేదికగా తాడోపేడో

సిటీ సివిల్‌ కోర్టు వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం శివరాం హెబ్బార్, బీసీ పాటిల్, హెచ్‌టీ సోమేశేఖర్, కె.సుధాకర్, నారాయణగౌడ, బైరతి బసవరాజు ఉన్నట్లు తెలిసింది. మంత్రుల పిటిషన్లపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. అలా పిటిషన్లను వేసిన ఆరుమంది మంత్రులను వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించాలని జేడీఎస్‌ ఎమ్మెల్యే. సా.రా. మహేశ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మైసూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో ప్రసారం చేయకుండా ఆదేశాలను జారీ చేయాలని ఆరుగురు మంత్రులు కోర్టును ఆశ్రయించారని, వారిపై కఠిన చర్యల తీసుకోవాలని అన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ వీడియోల గురించి డిమాండ్లు చేయడం అసెంబ్లీని అవమానపర్చడమేనని ధ్వజమెత్తారు.

Also Read: బెంగాల్‌లో మమతా బెనర్జీ బీజేపీని ఢీకొట్టే ప్లాన్ ఇదే..

ఇదిలా ఉండగా.. తప్పు చేయనప్పుడు భయం ఎందుకని.. కోర్టును ఎందుకు ఆశ్రయించారని మహేశ్‌ ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే ఆ వీడియోల ద్వారా బండారం బయటపడుతుందని ఆందోళన చెందుతున్నారని అభిప్రాయపడ్డారు. అలా జరగకుండా తప్పించుకునేందుకే కోర్టుకెళ్లారు అని ఆరోపించారు. ముంబైకి వెళ్లిన మంత్రులు అక్కడ చేసిన ఘనకార్యాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఎద్దేవా చేశారు. పలువురు ప్రతిపక్ష నేతలు ఇదే తరహాలో ఆరోపణలు సంధించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

మరోవైపు.. కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ స్పందిస్తూ తమ సీడీలను విడుదల చేయరాదని కొందరు కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా కోర్టుకెళ్లడం సరికాదని అన్నారు. ఆయన బెంగళూరు కేసీ జనరల్‌ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొని విలేకర్లతో మాట్లాడారు. రాసలీలల సీడీపై పార్టీ జాతీయ అధ్యక్షునికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సమాచారం పంపించారు. మీడియాలో వచ్చిన వార్తలనూ నాయకత్వానికి పంపారు. ఇలాంటి ఘటనల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేరళ సీఎంపై బంగారం స్మగ్లింగ్‌ వంటి బలమైన ఆరోపణలు వచ్చినందున ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.