Homeజాతీయ వార్తలుDana Cyclone: మరో తుపాను గండం.. అప్రమత్తమైన ప్రభుత్వం మూడు రోజులు సెలవులు..

Dana Cyclone: మరో తుపాను గండం.. అప్రమత్తమైన ప్రభుత్వం మూడు రోజులు సెలవులు..

Dana Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం తుపానుగా మారి ఓడిశా తీరంవైపు కదులుతోంది. దీంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఓడిశాకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక తుపానుకు దానాగా పేరు పెట్టింది. ఈ దానా ప్రభావంతో అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ఒడిశా ప్రభుత్వం కూడా అలర్ట్‌ అయింది. అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించింది. తుపాను ప్రభావంతో ఒడిశా తీరప్రాంతం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అక్టోబరు 24న దానా తుఫాను తీరం దాటుతుందని, పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయతో సహా ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఒడిశాలో 14 జిల్లాల్లో ప్రభావం..
ఇదిలా ఉంటే దానా తుపాను ప్రభావం ఒడిశాలోని 14 జిల్లాల్లో ఉంటుందని వాతావరణ శాఖ అంచనా. రాష్ట్రంలోని గంజాం, పూరి, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, కియోంజర్, ధెంకనల్, జాజ్‌పూర్, అంగుల్, ఖుర్దా, నయాగర్గ్, కటక్‌ జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. తీరప్రాంత ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ దీవులకు కొండచరియల విరిగిపడే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్‌రాయ్‌ హెచ్చరించారు. మంగళవారం, బుధవారం(అక్టోబర్‌ 23న) అండమాన్‌ నికోబాద్‌ దీవులు, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా ఓడిశా భారీ వర్షాలు కురుస్తాయని ఐంఎడీ తెలిపింది. గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరప్రాంతాలలో అక్టోబర్‌ 24, 25 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అసోంలో కూడా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. త్రిపుర, మిజోరాం, మేఘాలయలో అక్టోబర్‌ 23–25 వరకు, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33–34 డిగ్రీల సెల్సియస్‌ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 18–20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.

అల్పపీడనం ఇలా..
తూర్పు–మధ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్‌ సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడింది, సోమవారం(అక్టోబర్‌ 21న) ఉత్తర అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని తూర్పు–మధ్య – ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఎగువ వాయు తుఫాను ప్రభావంతో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. తూర్పు–మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్‌ సముద్రం మీదుగా ఈరోజు, 21 అక్టోబర్‌ 2024 తెల్లవారుజామున ఐఎండీ ఎక్స్‌లో పేర్కొంది. ఈ అల్పపీడనం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్‌ 22 ఉదయం నాటికి అల్పపీడనంగా మరియు అక్టోబర్‌ 23 నాటికి తూర్పు–మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. తర్వాత తుపాను వాయువ్య దిశగా కదిలి అక్టోబర్‌ 24 ఉదయం ఒడిశా–పశ్చిమ బెంగాల్‌ తీరాల మీదుగా వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version