Homeఆంధ్రప్రదేశ్‌ఆ రంగులకు నాలుగు వేల కోట్లు ఎలా ఖర్చయ్యాయి..? : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం

ఆ రంగులకు నాలుగు వేల కోట్లు ఎలా ఖర్చయ్యాయి..? : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం

YCP Colors
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక గ్రామ పంచాయతీలకు వైసీపీ జెండా రంగులు వేయాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు వేయడంపై ఆ టైమ్‌లో పెద్ద దుమారమే రేపింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ రంగుల కోసం, దుర్వినియోగం చేసిన ప్రజాధనాన్ని వైసీపీ నుండి, మంత్రుల నుండి రికవరీ చేయాలని డాక్టర్ శైలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: సీనియర్లు రాకున్నా.. సత్తా చాటిన రేవంత్‌

ఈ రంగులు వేయడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లుగా పేర్కొన్న డాక్టర్ శైలజ వాటిని రికవరీ చేయాలని కోరింది. ఈ పిటిషన్ విచారించిన కోర్టు నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చయిందో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల విషయంలో దాఖలు చేసిన పిటిషన్‌పై పిటిషనర్ తరఫున అడ్వకేట్ డీఎస్ ఎన్ వి ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. ఈ కేసులో కోర్టు తీర్పు వచ్చే వరకు మాజీ సీఎస్ నీలం సాహ్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మంత్రుల నుండి బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలని పిటిషనర్ కోరారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటం పెద్ద వివాదానికి కారణం అయ్యింది. అయితే ఆ రంగులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులు అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Also Read: నటుడిగా కాదు.. ప్రమాద బాధితుడిగా వచ్చాను: ఎన్టీఆర్ ఎమోషనల్

ఆ తర్వాత హైకోర్టు ప్రభుత్వ పంచాయతీ భవనాలకు ఉన్న రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో మళ్లీ రంగులు మార్చాల్సి వచ్చింది .

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular