spot_img
Homeజాతీయ వార్తలుకరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

Ganesh Puja
అందరు అనుకున్నట్లేగానే.. కరోనా ఎఫెక్ట్ గణేశ్ ఉత్సవాలపై పడింది. దీంతో ప్రతియేటా ఘనంగా జరిగే నవరాత్రి ఉత్సవాలను ఈసారి ఇంటికే పరిమితం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభణ కారణంగా అనేక పండుగలు కళతప్పాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఘనంగా నిర్వహించే శ్రీరామ నవమి, ఉగాది, రంజాన్ పండుగలు కళతప్పిపోయాయి. ఇక భాగ్యనగరానికే వన్నెతెచ్చే బోనాల పండుగ కూడా కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సంగతి తెల్సిందే.

Also Read: తెలంగాణకు కేంద్రం భారీ నిధులు.. అయినా టెస్టులు తక్కువే?

తాజాగా వినాయక చవితి ఉత్సవాలను కూడా ఇంటికే పరిమితం కానున్నాయి. ఈమేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయక ఉత్సవాలపై క్లారిటీ ఇచ్చారు. సోమవారం మాసాబ్ ట్యాంకులోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, మహానగర పాలక సంస్థ కమిషనర్ లోకేష్ కుమార్, భాగ్యనగర ఉత్సవ కమిటీ నిర్వహాకులు తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలపై మంత్రి తలసాని క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్న కారణంగా గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. ఈసారి గణేష్ ఉత్సవాలను ప్రజలకు ఇళ్లల్లోనే శాస్త్రోకత్తంగా నిర్వహించుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నవరాత్రులు పూర్తయ్యే వరకు వినాయక విగ్రహాలను పూజలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: ఓవైపు కరోనా.. మరోవైపు వానలు.. దేనికి సంకేతం?

ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాలు ఈసారి కళతప్పనున్నాయి. నిమజ్జనం రోజున గణనాథులను ఆటపాటలతో గంగమ్మ ఒడికి చేర్చడం ఆనవాయితీగా వస్తోంది. గణేష్ ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు కూడా ప్రజలకు పలు సూచనలు చేశారు. వినాయక చవితి వేడుకలు, మొహరం ఒకేసారి వస్తున్నాయని తెలిపారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రద్దీ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టడానికి అనుమతులు లేవన్నారు.

ప్రజలు ఇళ్లలోనే వినాయక విగ్రహాలను పెట్టి పూజలు చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మీరు.. మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఆయన ట్వీటర్లో ట్వీట్ చేశారు. అయితే అందరి విఘ్నాలను దూరంచేసే విఘ్నరాజుకే కరోనా విఘ్నం ఏర్పడటం శోచనీయాంగా మారిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
Oktelugu Epaper
Exit mobile version