క్వారంటైన్ నుంచి కరోనా బాధితులు జంప్..!

కడప జిల్లా కాశీనాయన మండలం చోటు చేసుకున్న సంఘటన జిల్లా అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. మండలం పరిధిలోని నరసాపురం క్వారంటైన్ సెంటర్ నుంచి కరోనా పాజిటివ్ పేషెంట్స్ పరారయ్యారు. అది కూడా ఒకరిద్దరు కాదు ఏకంగా 15 మంది పరారయ్యారు. దీంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురయ్యింది. ఇక్కడి క్వారంటైన్ సెంటర్ వద్ద అధికారులు ఎవ్వరు లేని సమయంలో 15 మంది బాధితులు గుట్టుచప్పుడు కాకుండా చెక్కేశారు. వీరు ఎక్కడికి వెళ్లారనేది తెలియరాలేదు. వీరి ఆచూకీ కోసం […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 5:18 pm
Follow us on


కడప జిల్లా కాశీనాయన మండలం చోటు చేసుకున్న సంఘటన జిల్లా అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. మండలం పరిధిలోని నరసాపురం క్వారంటైన్ సెంటర్ నుంచి కరోనా పాజిటివ్ పేషెంట్స్ పరారయ్యారు. అది కూడా ఒకరిద్దరు కాదు ఏకంగా 15 మంది పరారయ్యారు. దీంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురయ్యింది.

ఇక్కడి క్వారంటైన్ సెంటర్ వద్ద అధికారులు ఎవ్వరు లేని సమయంలో 15 మంది బాధితులు గుట్టుచప్పుడు కాకుండా చెక్కేశారు. వీరు ఎక్కడికి వెళ్లారనేది తెలియరాలేదు. వీరి ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన వ్యక్తులు కావడంతో వైరస్ ను ఎంతమందికి సోకేలా చేస్తారో అని అధికారులు ఆందోళన చెబుతున్నారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వ్యక్తులు క్వారంటైన్ కేంద్రాల నుంచి పారిపోయిన సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఎంత పెద్ద సంఖ్యలో ఎప్పుడూ పారిపోలేదు. గుంటూరు ప్రభుతాసుపత్రిలోని క్వారంటైన్ నుంచి కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువకుడు పారిపోయాడు. మచిలీపట్నం లో ఒక మహిళ క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోతే పోలీసులు వెతికి పట్టుకొని తిరిగి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.