కరోనా: కాసుల కక్కుర్తి.. ప్రైవేట్ ఆస్పత్రుల పైరవీలు

కాసుల కక్కుర్తిలో పడి ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో వ్యాపారం చేస్తున్నాయి. పైసలు కట్టనిదే వైద్యం చేయని దుస్థితి నెలకొంది. తెలంగాణలోని హైదరాబాద్లో అయితే ఏకంగా కరోనా చికిత్స 32 లక్షలు తీసుకున్న వైనం విస్తుగొలుపుతోంది. ఏపీలో అయితే విజయవాడ స్వర్ణప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించి 10మంది ప్రాణాలు పోయాయి. దీంతో జగన్ సర్కార్ విజయవాడలోని ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేసింది. తాజాగా మరికొన్ని నిబంధనలు పాటించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తూ […]

Written By: NARESH, Updated On : September 15, 2020 2:08 pm
Follow us on

కాసుల కక్కుర్తిలో పడి ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో వ్యాపారం చేస్తున్నాయి. పైసలు కట్టనిదే వైద్యం చేయని దుస్థితి నెలకొంది. తెలంగాణలోని హైదరాబాద్లో అయితే ఏకంగా కరోనా చికిత్స 32 లక్షలు తీసుకున్న వైనం విస్తుగొలుపుతోంది. ఏపీలో అయితే విజయవాడ స్వర్ణప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించి 10మంది ప్రాణాలు పోయాయి. దీంతో జగన్ సర్కార్ విజయవాడలోని ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేసింది. తాజాగా మరికొన్ని నిబంధనలు పాటించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Also Read : హైదరాబాద్ కు మహర్ధశ

విజయవాడలో రిటైర్ మెంట్ రోజున పెద్ద ఎత్తున ప్రైవేట్ కోవిడ్ సెంటర్లకు అనుమతిచ్చిన మాజీ డీఎంహెచ్వోపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ కోవిడ్ సెంటర్లన్నీ ఇప్పుడు పైరవీల బాటపట్టాయి.

ఈ క్రమంలోనే నిబంధనల ప్రకారం నడుచుకుంటే.. అన్నీ సక్రమంగా ఉంటేనే వాటికి అనుమతి ఇస్తామని కొత్త డీఎంహెచ్ వో చెబుతున్నారట.. ఒకసారి రద్దు చేశాక వెంటనే అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని కూడా చెబుతున్నారట.. ఈ దెబ్బకు ప్రైవేట్ కోవిడ్ సెంటర్లు అన్నీ తలపట్టుకుంటున్నాయని బెజవాడలో టాక్ నడుస్తోంది.

స్వర్ణ ప్యాలెస్ ఘటన జరిగిన తర్వాత విజయవాడలోని 9 కోవిడ్ సెంటర్లకు ఇచ్చిన అనుమతులను నాడు రద్దు చేశారు. ఇప్పుడు మరికొన్ని ఆస్పత్రులకు చెక్ చెప్పారు. అయితే అర్థాంతరంగా అనుమతులు రద్దు చేయడంపై ఆస్పత్రులు లబోదిబోమంటున్నాయట.. వాటికి అనుమతి ఇచ్చే సమయంలో లక్షలు చేతులు మారినట్టు భోగట్టా. ఇప్పుడు అనుమతులు రద్దుతో అవి గగ్గోలుపెడుతున్నాయి. అయితే అనుమతులు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అయితే అనుమతులు రద్దు చేసిన ఆస్పత్రులన్నీ మళ్లీ ప్రజాప్రతినిధుల అండతో దరఖాస్తు చేసుకున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఒక ఆస్పత్రి కోసం ఏకంగా సీఎంవో నుంచే ఓ అధికారి సిఫారసు చేశారట.. ఇక మరో ఆస్పత్రి కోసం ఏకంగా ఇద్దరు అధికార ఎంపీలు మంత్రాంగం నడుపుతున్నారట.. ఇక ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా అధికారులకే ఫోన్లు చేస్తున్నారట.. ఇలా ప్రైవేట్ కోవిడ్ సెంటర్లకు ఈ మహమ్మారిని క్యాష్ చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాయని ఏపీలో టాక్ నడుస్తోంది.

Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?