ఏపీలో 12 గంటల్లోనే 43 కరోనా పాజిటివ్ కేసులు!

ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మంగళవారం) రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 373 మంది కి కరోనా టెస్టులు చేయగా అందులో 43 పాజిటివ్‌ గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి.  వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 10కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు సమాచారం. పాజిటివ్‌ కేసులను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. బాధితులంతా ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో […]

Written By: Neelambaram, Updated On : April 1, 2020 12:10 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మంగళవారం) రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 373 మంది కి కరోనా టెస్టులు చేయగా అందులో 43 పాజిటివ్‌ గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి.  వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కడప జిల్లాలో 10కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు సమాచారం. పాజిటివ్‌ కేసులను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. బాధితులంతా ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో 15మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఐసోలాషన్ వార్డ్స్ కి పంపించారు.