
రాజకీయ ప్రత్యర్థులను ఎలాగైనా సరే అభాసుపాలు చేయాలని చూస్తుంటాయి ప్రత్యర్థి పార్టీలు. ఆ పార్టీలకు కావాల్సింది అవకాశం మాత్రమే. అలాంటి అవకాశం కోసం చూస్తున్న వైసీపీ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ను టార్గెట్ చేసింది. ఆయనపై సోషల్ మీడియాలో ఓ ప్రచారాన్ని చేస్తోంది. అదేంటంటే..
‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కొడుకుకు కరోనా సోకింది.’ అని సోషల్ మీడియాలో ఆడేసుకుంటోంది. ఎంతో ఫేమస్ లీడర్, మాజీ సీఎం అయిన ప్రతిపక్ష నేత ఇప్పుడు కొడుకును క్వారంటైన్ లో ఉండడం చూసి తల్లడిల్లి పోతున్నారని చెబుతోంది. తన కొడుకు యోగ క్షేమాల గురించి ఒకటే ఆందోళన పడుతున్నారని ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం వెనుక ఆరాతీస్తే పెద్ద కథే బయటపడింది.
*వైసీపీ ప్రచారమిదీ..
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కొడుకు ఇటీవల జనంలో బాగా తిరిగాడు. ఎక్కడెక్కడో రాజకీయం చేశాడు. రాష్ట్రంలో బాగా కరోనా ప్రబలడంతో ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే టెస్ట్ చేయగా కరోనా అని తేలింది. దీంతో క్వారంటైన్ లోకి తరలించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతకు దూరంగా క్వారంటైన్ లో కొడుకు చికిత్స పొందుతున్నాడు.
*టీడీపీ నేతల్లో ఆందోళన
అయితే ఈ ప్రతిపక్ష నేత అనగానే మన చంద్రబాబా అని అందరూ ఆరాతీశారు. ఆయన కొడుకు లోకేష్ గురించి అని గాబారా పడ్డారు తెలుగు తమ్ముళ్లు. ఎందుకంటే దానికి రీజన్ ఉంది. ఇటీవలే ఏపీలో అడుగుపెట్టారు చంద్రబాబు, లోకేష్. వారిని టీడీపీ నేతలు చుట్టుముట్టి తెగ హడావుడి చేశారు.
*చంద్రబాబు, లోకేష్ రాకతో వైసీపీ ప్లాన్
ఇటీవలే తాజాగా రెండు నెలల లాక్ డౌన్ అనంతరం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పక్కరాష్ట్రం నుంచి తన సొంత రాష్ట్రానికి వచ్చారు.. మంది మార్బలంతో ఎంట్రీలోనే అదరగొట్టారు. దండయాత్రలా ఈ పర్యటన సాగింది. లాక్ డౌన్ నిబంధనలు గాలికి వదిలి.. కరోనా వ్యాపిస్తుందన్న కనీస సృహ లేకుండా మోటార్ సైకిల్ ర్యాలీలు .. నాయకులతో సామాజిక దూరం పాటించకుండా బాబు కలిసిపోవడాలు చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలా తిరిగితే కరోనా వ్యాపించడా అని విమర్శలు వచ్చాయి.
*అసలు విషయం ఇదీ..
అయితే ఇదంతా వేరే విషయం.. కరోనా చంద్రబాబుకు, లోకేష్ కు ఈ ర్యాలీతో వస్తుందో లేదో తెలియదు కానీ.. రాజస్థాన్ లో మాత్రం వచ్చింది. ఇలానే చంద్రబాబులా జనంలోకి వెళ్లిన రాజస్థాన్ మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు వసుంధరా రాజే కుమారుడికి కరోనా వచ్చింది. దీంతో ఆమె కొడుకును క్వారంటైన్ కు తరలించారు. ఇప్పుడు చికిత్స కూడా పొందుతున్నాడు.
*రాజస్థాన్ ప్రతిపక్ష నేత కుమారుడికి కరోనా..
ప్రధాన ప్రతిపక్షనేత కుమారుడు అనగానే అందరూ లోకేష్ ను తలుచుకున్నారు. ఎందుకంటే ఏపీలో వీళ్లు చేసిన హడావుడికే లోకేషే అందరికీ గుర్తుకొచ్చాడు. కానీ అసలు కరోనా వచ్చింది లోకేష్ కు కాదు.. రాజస్థాన్ ప్రతిపక్ష నేత కుమారుడికి తాజాగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడిని క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఈ వార్తను ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కొడుకుకు కరోనా సోకింది.’ అని వైసీపీ వైరల్ చేసి లోకేష్ కే సోకిందనేలా తెగ ప్రచారం చేశాయి. టీడీపీ శ్రేణులను బెదరగొట్టాయి. అదన్న మాట సంగతి.. ఈ వార్త తెలియడంతో రాజకీయ నాయకులు కూడా జర జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.