గత 24గంటలలో 3వేలు దాటిన కొత్త కేసులు!

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,390 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 56,342కి చేరింది. అలాగే 24 గంటల్లో 1,273 మంది రికవర్ అయ్యారు. దింతో 16,540 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం రికవరీ రేటు 29.36కు చేరింది. 1,886 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలోని 216 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని, 42 జిల్లాల్లో గత 28 రోజులుగా […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 7:14 pm
Follow us on

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,390 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 56,342కి చేరింది. అలాగే 24 గంటల్లో 1,273 మంది రికవర్ అయ్యారు. దింతో 16,540 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం రికవరీ రేటు 29.36కు చేరింది. 1,886 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

దేశంలోని 216 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని, 42 జిల్లాల్లో గత 28 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు. గత 21 రోజులుగా 29 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని, 36 జిల్లాల్లో 14 రోజులుగా నమోదు కాలేదని చెప్పారు. 46 జిల్లాల్లో ఏడు రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు.