Homeఅంతర్జాతీయంIndia - China: భార‌త్‌లో చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌న‌..! వారితో భేటీ ఎందుకంటే ?

India – China: భార‌త్‌లో చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌న‌..! వారితో భేటీ ఎందుకంటే ?

India- China: డ్రాగ‌న్ దేశం చైనా స‌రిహ‌ద్దుల్లో కొద్ది రోజులుగా క‌వ్వింపు చ‌ర్య‌లకు పాల్ప‌డ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. 2020లో గాల్వాన్‌లో చోటుచేసుకున్న ఘ‌ర్ష‌న‌లు, తూర్పు ల‌డ‌ఖ్‌లో స‌రిహ‌ద్దు ప్ర‌తిష్టంబ‌న నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌నపై గంట‌ల త‌ర‌బ‌డి స‌స్పెన్స్ నెల‌కొంది. అస‌లు ఆయ‌న వ‌స్తారో.. లేదో..? అన్న సందేహం త‌లెత్తింది. చివ‌ర‌కు ఆయ‌న భార‌త్‌కు వ‌చ్చారు. కాగా ఆయ‌న చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌న అధిక ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

India- China
India- China

నేడు (శుక్ర‌వారం) ఢిల్లీలో భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌, జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ తో భేటీ కానున్నారు. ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలిసింది. గ‌తంలో ఇస్లామాబాద్‌లో విదేశాంగ మంత్రుల స‌మావేశం జ‌రిగింది. ఆగ్గ‌నైజేష‌న్ ఆఫ్ ఇస్లామిక్ ఆప‌రేష‌న్‌లో జ‌మ్మూక‌శ్మీర్‌పై వాంగ్‌యి ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంలో చైనాకు భార‌త్ గ‌ట్టి కౌంట‌ర్ కూడా ఇచ్చింది.

Also Read: Mahesh Babu About RRR: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ చెప్పిన మహేష్ !

జ‌మ్ముక‌శ్మీర్ అనేది భార‌త్ అంత‌ర్గ‌త విష‌య‌మ‌ని, దీనిపై వ్యాఖ్య‌లు చేయ‌డానికి చైనాకు ఎలాంటి హ‌క్కు లేద‌ని తేల్చిచెప్పింది. అలాగే ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని వాంగ్‌యికి సూచించింది. ఈ నేప‌థ్యంలో వాంగ్‌యి భార‌త్ ప‌ర్య‌ట‌న‌, అజిత్ ధోవ‌ల్‌, జైశంక‌ర్‌తో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

India- China
India- China

ఇది ఇరుదేశాల మ‌ధ్య సంబంధాలు తిరిగి సాధార‌ణ స్థితికి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయని, ఇందుకు వారి చ‌ర్చ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని స‌మాచారం. అయితే ఈ ఏడాది చివ‌ర‌లో బీజింగ్‌లో జ‌ర‌గ‌బోయే బ్రిక్స్ స‌ద‌స్సుకు ప్ర‌ధాని మోడీని ఆహ్వానించ‌డానికే ఈ ప‌ర్య‌ట‌న అని ప‌లు జాతీయ మీడియాల్లో ఇప్ప‌టికే క‌థ‌నాలు ప్ర‌చురిత‌మైన విష‌యం విధిత‌మే. మొత్తంగా భారత్‌లో చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌న రెండు రోజుల పాటు ఉండ‌నుంది.

Also Read: Somu Veerraju: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ సోమువీర్రాజు

Recommended Video:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper