Homeఅంతర్జాతీయంIndia - China: భార‌త్‌లో చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌న‌..! వారితో భేటీ ఎందుకంటే ?

India – China: భార‌త్‌లో చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌న‌..! వారితో భేటీ ఎందుకంటే ?

India- China: డ్రాగ‌న్ దేశం చైనా స‌రిహ‌ద్దుల్లో కొద్ది రోజులుగా క‌వ్వింపు చ‌ర్య‌లకు పాల్ప‌డ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. 2020లో గాల్వాన్‌లో చోటుచేసుకున్న ఘ‌ర్ష‌న‌లు, తూర్పు ల‌డ‌ఖ్‌లో స‌రిహ‌ద్దు ప్ర‌తిష్టంబ‌న నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌నపై గంట‌ల త‌ర‌బ‌డి స‌స్పెన్స్ నెల‌కొంది. అస‌లు ఆయ‌న వ‌స్తారో.. లేదో..? అన్న సందేహం త‌లెత్తింది. చివ‌ర‌కు ఆయ‌న భార‌త్‌కు వ‌చ్చారు. కాగా ఆయ‌న చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌న అధిక ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

India- China
India- China

నేడు (శుక్ర‌వారం) ఢిల్లీలో భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌, జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ తో భేటీ కానున్నారు. ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలిసింది. గ‌తంలో ఇస్లామాబాద్‌లో విదేశాంగ మంత్రుల స‌మావేశం జ‌రిగింది. ఆగ్గ‌నైజేష‌న్ ఆఫ్ ఇస్లామిక్ ఆప‌రేష‌న్‌లో జ‌మ్మూక‌శ్మీర్‌పై వాంగ్‌యి ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంలో చైనాకు భార‌త్ గ‌ట్టి కౌంట‌ర్ కూడా ఇచ్చింది.

Also Read: Mahesh Babu About RRR: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ చెప్పిన మహేష్ !

జ‌మ్ముక‌శ్మీర్ అనేది భార‌త్ అంత‌ర్గ‌త విష‌య‌మ‌ని, దీనిపై వ్యాఖ్య‌లు చేయ‌డానికి చైనాకు ఎలాంటి హ‌క్కు లేద‌ని తేల్చిచెప్పింది. అలాగే ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని వాంగ్‌యికి సూచించింది. ఈ నేప‌థ్యంలో వాంగ్‌యి భార‌త్ ప‌ర్య‌ట‌న‌, అజిత్ ధోవ‌ల్‌, జైశంక‌ర్‌తో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

India- China
India- China

ఇది ఇరుదేశాల మ‌ధ్య సంబంధాలు తిరిగి సాధార‌ణ స్థితికి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయని, ఇందుకు వారి చ‌ర్చ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని స‌మాచారం. అయితే ఈ ఏడాది చివ‌ర‌లో బీజింగ్‌లో జ‌ర‌గ‌బోయే బ్రిక్స్ స‌ద‌స్సుకు ప్ర‌ధాని మోడీని ఆహ్వానించ‌డానికే ఈ ప‌ర్య‌ట‌న అని ప‌లు జాతీయ మీడియాల్లో ఇప్ప‌టికే క‌థ‌నాలు ప్ర‌చురిత‌మైన విష‌యం విధిత‌మే. మొత్తంగా భారత్‌లో చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌న రెండు రోజుల పాటు ఉండ‌నుంది.

Also Read: Somu Veerraju: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ సోమువీర్రాజు

Recommended Video:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper