Homeఅంతర్జాతీయంచైనా అత్యుత్సాహం.. హిందూ మహాసముద్రంలోకి డ్రోన్లు

చైనా అత్యుత్సాహం.. హిందూ మహాసముద్రంలోకి డ్రోన్లు

China underwater drones
బార్డర్‌‌లో చైనాతో ఇంకా సమరం ముగియనేలేదు. ఏదో ఒక కవ్వింపు చర్యలతో ఇంకా భారత సైన్యాన్ని రెచ్చగొడుతూనే ఉంది. మరోసారి దాని కుట్రలు వెలుగులోకి వచ్చాయి. హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యానికి సవాల్‌ విసిరేలా కొత్త ఎత్తుగడలు వేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ సాగరంలో జలాంతర డ్రోన్లను భారీగా మోహరించింది.

Also Read: ‘తలైవా’ ఇంటి ముందు టెన్షన్.. టెన్షన్..!

‘సీ వింగ్‌’ అనే ఈ సాధనలు నెలల తరబడి రహస్యంగా కార్యకలాపాలు సాగించగలవు. ప్రత్యర్థి యుద్ధనౌకల కదలికలపై సమాచారాన్ని సేకరించేందుకు ఇవి ఉపయోగపడుతాయని రక్షణ విశ్లేషకుడు హెచ్‌ఐ సట్టన్‌ తెలిపారు. ఈ డ్రోన్‌ ఒకరకమైన మానవరహిత వాహనం. వీటిని 2019 డిసెంబర్‌‌లో చైనా రంగంలోకి దింపింది. దాదాపు 3400 పరిశీలనలు చేపట్టాక ఫిబ్రవరిలో వాటిని వెలికి తీసింది. గతంలో అమెరికా నౌకాదళం లిట్టోరల్‌ బ్యాటిల్‌స్పేస్‌ సెన్సింగ్‌–గ్లైడర్‌‌ అనే డ్రోన్‌ను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. దీన్ని 2016 డిసెంబర్‌‌ 15న చైనా స్వాధీనం చేసుకుంది. వివాదం ముదరడంతో అమెరికాకు తిరిగి అప్పగించింది.

అలాంటి సాధనాన్నే చైనా తయారు చేయడం గమనార్హం. ‘రివర్స్‌ ఇంజినీరింగ్‌’ పద్ధతిలో ఇతర దేశాల ఆయుధాలను, సామగ్రిని కాపీ కొట్టగల నేర్పరి చైనా. ఇది అందరికీ తెలిసిన విషయమే. ‘సీ వింగ్‌’ నడవడానికి ఎలాంటి యంత్రాలు అవసరం లేదు. భారీ రెక్కల సాయంతో అది గ్లైడ్‌లా కదులుతుంటుంది. ఇందులో బెలూన్‌లాంటి సాధనం ఉంటుంది. అందులో ఉండే పీడనంతో కూడిన ఆయిల్‌తో ఇది ఉబ్బెత్తుగా మారుతుంది. ఫలితంగా ఈ డ్రోన్‌ నీటి కిందకు వెళ్లిపోతుంది. కొద్ది సేపటి తర్వాత బెలూన్‌లోని ఆయిల్‌ బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా డ్రోన్ నీటిపైకి వస్తుంది. దీనికి తోక భాగంలో యాంటెన్నా ఉంటుంది. దీని సాయంతోనే చైనా యుద్ధనౌకలకు సమాచారాన్ని చేరవేస్తుంది.

Also Read: న్యూ ఇయర్ కు ఘన స్వాగతం.. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు

ఇప్పుడు హిందూ మహాసముద్రంలో సీ వింగ్‌లను పెద్ద సంఖ్యలో దింపింది చైనా. అక్కడ 14 డ్రోన్లను మోహరించాలని డ్రాగన్‌ టార్గెట్‌. కానీ.. 12 డ్రోన్లను దింపింది. సముద్ర పరిశీలనకు వీటిని దించుతున్నట్లు చైనా చెబుతోంది. కానీ.. హిందూ మహాసముద్రంపై పట్టు బిగించేందుకు అనేక దేశాల మధ్య పోటీ నెలకొన్నట్లు భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవల ఒక సదస్సులో తెలిపారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version