జాతీయ వార్తలుTelangana BJP: పెద్ద ప్లాన్.. తెలంగాణలో గెలుపు కోసం ‘రాజస్థానీని’ దించిన అమిత్ షా

Telangana BJP: పెద్ద ప్లాన్.. తెలంగాణలో గెలుపు కోసం ‘రాజస్థానీని’ దించిన అమిత్ షా

Telangana BJP: పార్లమెంట్ ఎన్నికలకు ఇంక నోటిఫికేషన్ విడుదల కాకముందే భారతీయ జనతా పార్టీ అనేక అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం గట్టి పట్టు లేని నేపథ్యంలో ఈ రాష్ట్రాలపై దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి కర్ణాటక తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే చెప్పుకోదగిన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏకంగా నాలుగు పార్లమెంటు స్థానాలను బిజెపి గెలుచుకోగలిగింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవలి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడం, కాంగ్రెస్ కు కూడా భారీగా స్థానాలు రాకపోవడంతో..ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో అమిత్ షా పర్యటించినప్పుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కచ్చితంగా 10 సీట్లు గెలవాలని స్పష్టం చేశారు. ఆయన సమావేశం కొద్ది రోజులకే తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ మరింత పెట్టారు. కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

దక్షిణ భారత దేశంలో భారతీయ జనతా పార్టీకి కీలకంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించారు. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విషయంలో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్ ను ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు.. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను ఒక్క తాటి పైకి తేవడంలో చంద్రశేఖర్ విజయం సాధించారు. ముఖ్యంగా వసుంధర రాజే వర్గాన్ని సముదాయించడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ లో చాలా సంవత్సరాలు పనిచేయడంతో చంద్రశేఖర్ కు రాజస్థాన్ లో మంచి పేరు ఉంది. రాజస్థాన్ ఎన్నికల్లో పోషించిన పాత్రనే తెలంగాణ రాష్ట్రంలోనూ పోషించాలని చంద్రశేఖర్ కు అమిత్ షా ఇటీవల సూచించారు. రాష్ట్రంలో పార్టీకి సంబంధించి బలాలు, బలహీనతలను కూడా వివరించారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు అయితే వచ్చాయో… అటువంటి ఫలితాలనే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ సాధించాలని చంద్రశేఖర్ కు లక్ష్యంగా పెట్టారు.. పైగా ఇటీవల నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పది పార్లమెంటు స్థానాలు గెలవాలని అమిత్ షా పార్టీ నాయకులకు ఉద్బోధించారు.

ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బిజెపి నాయకత్వం ఉంది. ముచ్చటగా మూడోసారి కూడా తానే ప్రధానమంత్రి అవుతానని నరేంద్ర మోడీ పలు సమావేశాల్లో చెబుతున్నారు. ఆ భారాన్ని మొత్తం గత ఎన్నికల్లో మాదిరే అమిత్ షా పై వేశారు. అందుకు తగ్గట్టుగానే అమిత్ షా కూడా అడుగులు వేస్తున్నారు.. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఏకంగా మూడు రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలలో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ మధ్య తెలంగాణలోనూ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అధిష్టానం చేజేతులా నాశనం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో పది స్థానాలు సాధించగలుగుతుందా? తెలంగాణ రాష్ట్రంలో జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని నిలువరించగలుగుతుందా? చంద్రశేఖర్ రాజస్థాన్ రాష్ట్రంలో మాదిరిగా మ్యాజిక్ ప్రదర్శించగలుగుతారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గ్రూపులుగా విడిపోయిన బిజెపి నాయకులను కలిపి.. ఎన్నికలకు సమాయత్తం చేసిన దానినిబట్టే బిజెపికి పార్లమెంటు ఎన్నికల్లో విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని వారు అంటున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

BJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP:  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా పాలనా అధికారం కోసం పోటీపడే ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన మెట్టు. ఈ రాష్ట్రం 80 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే అత్యధిక...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Oktelugu Epaper