
బొల్లినేని శ్రీనివాస గాంధీ.. ఈ పేరు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే. ఈయన గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఈయనే అక్రమాస్తుల కేసులో జగన్ ను బుక్ చేశారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రోద్బలంతోనే బొల్లినేని ఇలా చేశాడని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
Also Read: పవన్ విశాఖలో అడుగుపెడితే ఏమవుతుంది?
అయితే గత పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా తీసుకున్న శ్రీనివాస గాంధీ తాజాగా ఆయన కుమార్తె మెడికల్ సీటుకే రూ.70 లక్షలు కట్టారని గుర్తించారు. కూకట్ పట్టి హైదర్ నగర్ లో 1.20 కోట్లతో ఇంటిని నిర్మించారు. ఏపీ, తెలంగాణలో స్థిరాస్థులు కూడబెట్టి మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్టు సీబీఐకి ఉప్పందింది. ఇంకేముంది ఓ కేసులో తాజాగా బుక్ చేసింది.
హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి బయటపడింది. ఇన్ ఫుట్ క్రెడిట్ మంజూరుకు అధికారులు ఓ కంపెనీ డైరెక్టర్ల నుంచి ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఉద్యోగులు సుధారాణి, బొల్లినేని శ్రీనివాస గాంధీ, ఓ ప్రైవేటు కంపెనీ డైరెక్టర్ సత్య శ్రీధర్ రెడ్డిలపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
ఓ ప్రైవేటు కంపెనీకి సంబంధించిన దాడుల్లో ఈ లంచం వ్యవహారం గుట్టు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సీబీఐ అధికారులు జీఎస్టీ కమిషనరేట్ లోని అవినీతి తిమింగలాలను పట్టుకున్నారు.ఆదాయానికి మించి ఆస్తుల కేసు తవ్వుతున్న క్రమంలోనే బొల్లినేనిపై తాజాగా కేసు నమోదైందని సమాచారం.
Also Read: ఆమ్రపాలికి అరుదైన అవకాశం!
మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా బొల్లినేని శ్రీనివాసగాంధీకి పేరుంది.బొల్లినేని 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. అప్పట్లో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఆయనపై నమోదైంది. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో పనిచేసినప్పుడు తన పోస్టును అడ్డం పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు, సూచనలతోనే ఎదుటివారిపై విరుచుకుపడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
Comments are closed.