spot_img
Homeజాతీయ వార్తలుKangana Ranaut: ‘మండి’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెలుపు.. ఎంత మెజారిటీతోనంటే?

Kangana Ranaut: ‘మండి’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెలుపు.. ఎంత మెజారిటీతోనంటే?

Kangana Ranaut: సినీ నటి.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. క్వీన్ మరియు తను వెడ్స్ మను వంటి భారీ సినిమాల్లో నటించిన ఆమె మొదటి సారిగా ఎన్నికల్లో బీజేపీ తరుఫున హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 74,755 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది.

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు కాంగ్రెస్‌కు చెందిన విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేసి విజయం సాధించారు. వీరభద్ర సింగ్ గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. అక్కడ విజయం సాధించిన ఆయన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యాడు. మొదటి సారి ఆయన లోక్ సభకు పోటీ చేశాడు.

మండి లోక్‌సభ స్థానంలో 2014, 2019లో వరుసగా బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ విజయం సాధించారు. 2014లో 49.97 శాతం, 2019లో 68.75 శాతం ఓట్లతో విజయం సాధించారు. మార్చి 17, 2021న స్వరూప్ శర్మ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో విక్రమాధిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి గెలిచారు.

ప్రధాని నరేంద్రమోడీకి అభిమానించే కంగనా రనౌత్ ఈ సంవత్సరం (2024) మొదటి బీజేపీలో చేరింది. తన పూర్వీకులు ఉన్న మండి టికెట్ ఇవ్వాలని కోరింది. ఆమె కోరిక మేరకు బీజేపీ ఆ టికెట్ ను ఇచ్చి పోటీలో నిలిపింది.

‘నా ప్రియమైన భారత ప్రజలకు చెప్తున్నాను. ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని మండి (నియోజకవర్గం) నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నా. యోగ్యమైన కార్యకర్తగా, నమ్మకమైన ప్రజా సేవకురాలిగా ఎదురుచూస్తున్నా. ధన్యవాదాలు’ అని రనౌత్ మార్చి, 24న తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.

రనౌత్ ముత్తాత సర్జూ సింగ్ రనౌత్ ఎమ్మెల్యే. ఆమె తల్లి, ఆశా రనౌత్, మండిలో పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ఆమె తండ్రి అమర్‌దీప్ రనౌత్ వ్యాపారవేత్త. ఆశా రనౌత్ కుటుంబం మొదట్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని, అయితే కంగనా ప్రభావంతో బీజేపీ వైపు మళ్లారు.

జూన్ 1న లోక్‌సభ ఎన్నికల ఏడో, చివరి దశ పోలింగ్ మండి లోక్ సభ నియోజకవర్గానికి జరిగాయి. రనౌత్ ప్రచారం సంచలనంగా మారింది. 2014లోనే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని, భారతదేశం ‘హిందూ రాష్ట్రం’గా మారాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేసింది.

ఇక ఇవన్నీపక్కన పెడితే ఆమె గెలుపొందడంపై ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపుతున్నారు. మొదటి సారి ఆమె లోక్ సభలో అడుగు పెట్టబోతోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version