Homeజాతీయ వార్తలుBJP Focus On Telangana: తెలంగాణ‌పై ఢిల్లీ నేత‌ల క‌న్ను.. ఏప్రిల్ లో మ‌రింత హీటెక్క‌నున్న...

BJP Focus On Telangana: తెలంగాణ‌పై ఢిల్లీ నేత‌ల క‌న్ను.. ఏప్రిల్ లో మ‌రింత హీటెక్క‌నున్న రాజ‌కీయాలు

BJP Focus On Telangana: తెలంగాణ‌లో మొన్న‌టి వ‌ర‌కు స్టేట్ లెవ‌ల్ లీడ‌ర్లు కుస్తీ ప‌ట్టారు. కానీ ఇక నుంచి జాతీయ నేత‌లు రంగంలోకి దిగుతున్నారు. వారంతా తెలంగాణ గ‌డ్డ‌మీద నువ్వా నేనా అన్న‌ట్టు త‌ల‌ప‌డ‌బోతున్నారు. దీంతో తెలంగాణ జాతీయ స్థాయిలో రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు కాబోతోంది. కేసీఆర్ ను గ‌ద్దె దించాల‌ని ఇప్ప‌టికే బీజేపీ తీవ్ర స్థాయిలో ప్ర‌య‌త్నిస్తోంది.

BJP Focus On Telangana
BJP

ముఖ్యంగా అమిత్ షా తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టిని సారిస్తున్నారు. కేసీఆర్ కేంద్రంపై ఒంటికాలిమీద లేవడంతో.. అమిత్ షా, మోడీలు తెలంగాణ మీద ప్ర‌త్యేక దృష్టిని సారిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వ‌ర‌లోనే అమిత్ షా తెలంగాణ‌కు రెండు సార్లు రావాల‌ని అనుకుంటున్నారు. రెండో విడ‌త బండి సంజ‌య్ పాద‌యాత్ర ప్రారంభోత్స‌వానికి వ‌చ్చి సంజ‌య్ పాద‌యాత్ర‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాల‌ని భావిస్తున్నారు.

Also Read: Telugu Desam Party: నాలుగు దశాబ్దాల పయనం…పడిలేస్తూ..లేచిపడుతూ ఎగసిపడుతున్న తెలుగుదేశం పార్టీ

మ‌రోసారి శ్రీరామ న‌వమి రోజున వ‌స్తున్నారు. ఆరోజు ఆధ్యాత్మిక యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఏప్రిల్ నెల‌లో భారీ ప్లాన్ చేస్తోంది. రేవంత్ త‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని ఎప్ప‌టి నుంచో భావిస్తున్నారు. రాహుల్‌ను రాష్ట్రానికి ర‌ప్పించి త‌న బ‌ల‌మేంటో చూపించాల‌ని క‌సి మీద ఉన్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగులతో ఓ సభ నిర్వ‌హించాల‌ని చూస్తున్నారు.

ఇక కేజ్రీవాల్ కూడా తొమ్మిది రాష్ట్రాల్లో ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఆయ‌న కూడా ఏప్రిల్ లోనే రాష్ట్రానికి వ‌స్తున్నారు. తెలంగాణలో పాదయాత్ర చేసే అవ‌కాశం కూడా ఉంది. విచిత్ర ఏంటంటే.. అమిత్ సా వ‌స్తున్న ఏప్రిల్ 14న కేజ్రీవాల్ కూడా వ‌స్తున్నారు. ఇలా జాతీయ స్థాయి నాయ‌కులంతా తెలంగాణ‌లో మ‌కాం వేయ‌నున్నారు.

BJP Focus On Telangana
BJP and KCR

ఇన్ని రోజులు జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకున్న వీరంతా.. త్వ‌ర‌లోనే తెలంగాణ వేదిక‌గా పోటీ ప‌డ‌బోతున్నారు. మ‌రి ఇంత‌మంది జాతీయ నాయ‌కులు వ‌చ్చి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం మీద విరుచుకు ప‌డితే.. ప్ర‌భావం వేరే లెవ‌ల్ లో ఉంటుంది. కేజ్రీవాల్ లాంటి నేత‌లు వచ్చి విమ‌ర్శ‌లు చేయ‌డం అంటే ఎంతో కొంత టీఆర్ ఎస్ ఎఫెక్ట్ ప‌డే ఛాన్స్ లేక‌పోలేదు.

మ‌రి ముప్పేట ముంచుకొస్తున్న దాడిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటార‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరంతా కేసీఆర్‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తారా.. లేక ప‌నిలో ప‌నిగా ఒక‌రి మీద మ‌రొక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటారా అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తంగా చూస్తుంటే.. తెలంగాణ కేంద్రంగా జాతీయ స్థాయి నేత‌లు కుస్తీ ప‌ట్ట‌బోతున్నార‌న్న మాట‌.

Also Read: Raj Subramaniam New CEO Of FedEx: మ‌రో అంత‌ర్జాతీయ దిగ్గ‌జ కంపెనీకి సీఈవోగా ఇండియ‌న్ సంత‌తి వ్య‌క్తి..

Recommended Video:

RRR 3rd Day Collections || RRR Box Office Collections Report || Ok Telugu Entertainment

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version