Homeజాతీయ వార్తలుబీజేపీ పాచిక:  దేశంలో మరో మూడు కొత్త రాష్ట్రాలు..!

బీజేపీ పాచిక:  దేశంలో మరో మూడు కొత్త రాష్ట్రాలు..!

PM Modi New States

దేశంలో మరో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో త్వరలోనే మోదీ కేబినెట్ నిర్ణయం తీసుకునే సంకేతాలున్నాయని కథనాలు వినిపిస్తున్నాయి. దేశంలో పలు చిన్న రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇంకా పెద్దగానే ఉన్నాయి. పరిపాలన పరంగా రాజధానులకు సుదూరంలోనే వుండిపోయాయి. ఇలాంటి రాష్ట్రాల కోవలోకి ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వస్తాయి. అయితే తాజా ప్రతిపాదన మాత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది. ఇదివరకే 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.

Also Read: ‘లక్ష్మీవిలాస్’ ఎఫెక్ట్: ఏ బ్యాంకు సేఫ్?

అటల్‌ బీహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే బీజేపీ చిన్న రాష్ట్రాల పట్ల మొగ్గు చూపుతోంది. ఆ సందర్భంలోనే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను, మధ్య ప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్‌ను, బీహార్ నుంచి జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రాలుగా చేసింది. అయితే.. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఉత్తరప్రదేశ్ ఇంకా పెద్ద రాష్ట్రంగానే ఉంది. రాజధాని లక్నోకు సుదూరంలో పలు ప్రాంతాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ను మూడుగా విభజించాలని గతంలో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది.

అప్పట్లో మాయావతి సర్కార్ చేసిన ప్రతిపాదనను ఇప్పుడు మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 20 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న అవధ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తూ.. దానికి లక్నో రాజధానిగా చేసే అవకాశాన్ని కేంద్ర హోం శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తూ దానికి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)ను రాజధానిగా చేసే అవకాశాలున్నాయి. బుందేల్‌ఖండ్ పరిధిలో 17 జిల్లాలుంటాయి.

Also Read: ఆ టీడీపీ సీనియర్ నేతకు సీబీఐ గట్టి షాక్

మరోవైపు పూర్వాంచల్ ప్రాంతంలోని 23 జిల్లాలను కలిపి గోరఖ్‌పూర్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంగా చేసే పరిస్థితి కనిపిస్తోంది. అదేసమయంలో సహరాన్‌పూర్ ఏరియాలోని కొంత ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలిపే ప్రతిపాదనను హోం శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్ర విభజన ప్రతిపాదన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే జరిగే అవకాశాలున్నాయి హోం శాఖ వర్గాలంటున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version