BJP Border States Victory: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. 126 స్థానాల్లో 103 స్థానాలు గెలిచింది. బీజేపీ సొంతంగా 82 సీట్లు గెలిచింది. అసాధ్యాన్ని సుపాధ్యం చేసింది. ఇక బెంగాల్లో కూడా బీజేపీ 200లకుపైగా సీట్లతో తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఈరెండు రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు రెండు దేశాలు బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉన్నాయి. బెంగాల్లో గెలుపుతో దేశ భద్రత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
సరిహద్దు రాష్ట్రాల్లో బీజేపీ కోటలు
అస్సాం–బెంగాల్లో బీజేపీ అధికారం సాధించడం వల్ల పంజాబ్, జమ్మూ కశ్మీర్ మినహా అన్ని సరిహద్దు రాష్ట్రాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్న ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, అస్సాం, ఒడిశాలో బీజేపీ పాలన సాగిస్తోంది. ఏపీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంగా ఉండి, బీజేపీ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.్రఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర–రాష్ట్ర సమన్వయం సులభమవడం దేశ భద్రత విషయంలో పెద్ద ప్లస్ అని విశ్లేషకులు చూస్తున్నారు.
కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో సర్–తరహాల్ భారతీయ పౌరుల గణన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటుంది. సీఐఏ అమలు చేయడం ద్వారా బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో స్థిరంగా పేర్కొన్న సామాజిక వర్గాలకు పౌరసత్వం ఇవ్వడం వంటి నిర్ణయాలు సులభతరం అవుతాయి. ఇది దేశ సరిహద్దు అంతర్గత సురక్షిత ప్రమాణాలను బలోపేతం చేసే అంశం.
బీఎస్ఎఫ్, సర్ సురక్ష, గ్రామాల సోదాలు
గత ప్రభుత్వ కాలంలో బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో బీఎస్ఎఫ్ పనితీరు కొన్ని సందర్భాల్లో విమర్శలను ఎదుర్కొంది. 850 కిలోమీటర్లు ఉన్న భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచ వేయాలన్న ప్రయత్నాలకు మమతాబెనర్జీ వ్యతిరేకించింది. అదే విధంగా గ్రామాల్లో సోదాలు, బీఎస్ఎఫ్ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడంతో సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పనితీరు, కంచ వేయడం, సర్ సురక్షా చర్యలు, గ్రామ సోదాలు వంటి వాటిని మరింత కఠినంగా అమలు చేసే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి.
అంతర్గత భద్రత విషయంలో..
నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్లో బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల నక్సలైజం అణచివేత–లోయర్ ఇంటెన్సిటీ రాష్ట్రాల్లో సురక్షా చర్యలు హోమ్ గ్రౌండ్ లెవల్లో మరింత సమన్వయం కలిగి ఉంటాయి. జార్ఖండ్లో జేఎంఎం–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ నక్సల్ అణచివేతకు సహకారం అందిస్తున్నట్లు సమాచారం ఉంది. ఇది అంతర్గత భద్రత దృష్టిలో కేంద్ర–రాష్ట్ర సంఘాల మధ్య ఒక సానుకూల అంశం.
మొత్తగా దేశ సార్వభౌమత్వం, సరిహద్దు పాకిస్తాన్, బంగ్లాదేశ్ చొరబాట్లను వ్యతిరేకించేవారు సరిహద్దు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడాన్ని స్వాగతిస్తారు.