Bandi Sanjay:టీఆర్ఎస్ వాళ్లు ఓటుకు రూ.20వేలు ఇస్తున్నారు.. అవి దొంగనోట్లు.. ‘బండి’ సంచలనం

Bandi Sanjay: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ జోరు పెంచింది. తెలంగాన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. నేతలతో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈరోజు హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎసోళ్లు ఓటుకు రూ.20 వేలు ఇస్తామని దొంగ నోట్లు ఇచ్చే ప్రమాదం ఉందని.. అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో […]

Written By: NARESH, Updated On : October 21, 2021 7:10 pm
Follow us on

Bandi Sanjay: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ జోరు పెంచింది. తెలంగాన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. నేతలతో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈరోజు హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎసోళ్లు ఓటుకు రూ.20 వేలు ఇస్తామని దొంగ నోట్లు ఇచ్చే ప్రమాదం ఉందని.. అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో చూసుకోండని ప్రజలకు బండి సంజయ్ సూచించారు.

bandi sanjay in huzurabad by elections

ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ కేసీఆర్ కు డబుల్ ఆర్ సినిమా చూపించినం. వచ్చే నెల నుండి ప్రగతి భవన్ లో కేసీఆర్ కు ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కందుగుల గ్రామానికి కేంద్రం ఉపాధి హామీ పథకం కింద రూ.1.24 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం రూ. 93 లక్షలు, మొక్కల పెంపకానికి రూ.23 లక్షలు, ఆర్దిక సంఘం 1.19 కోట్లు, మరుగుదొడ్లకు రూ.10 లక్షలు, స్మశాన వాటికకు రూ.11 లక్షలు, డంప్ యార్డుకు రూ.2 లక్షలు, నర్సరీకి రూ.1లక్ష, రైతు వేదికకు రూ.10 లక్షలకుపైగా కేంద్రం ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో కేసీఆర్ ను నిలదీయండి. ఆ డబ్బుతో ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నడని ఆరోపించారు.

కేసీఆర్ మూర్ఖుడు. పేదోళ్లు కష్టపడుతున్నా, చస్తున్నా మానవత్వం లేదని బండి ఆరోపించారు. హైదరాబద్ లో వరదలొచ్చినా, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, రైతులు చస్తున్నా పట్టించుకోని కేసీఆర్ పెద్దోళ్లు చనిపోతే మాత్రం వెళ్లి బోకే పెట్టి ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. పేదోళ్లకు అన్యాయం జరుగుతోంది. వారికి న్యాయం జరగాలని 1400 మంది చనిపోతే తెలంగాణ వస్తే….పేద్దోళ్లు రాజ్యమేలుతున్నరని మండిపడ్డారు. శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్ సహా ఎందరో యువత ‘ మేం చచ్చిపోతేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. ఉద్యోగాలొస్తాయి’ అని బలిదానం చేసిండ్రు. కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేంది? 1400 మంది చనిపోతే కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతోంది అని నిప్పులు చెరిగారు.

ఎక్కడికి పోయినా పైసలు చల్లి ఓట్లు కొనే యత్నం చేస్తున్నారని.. ఈటల రాజేందర్ కష్టపడి పనిచేసిండు. కోవిడ్ సమయంలోనూ ఆసుపత్రులకు వెళ్లి ప్రజలకు భరోసా కల్పించిండు. కుటుంబ సభ్యులున్నా జనమే ముఖ్యమని కరోనా కష్టకాలంలోనూ పేదలను కాపాడాలని పనిచేసిన వ్యక్తి ఈటల రాజేందర్ అని కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదు? ఇంటికో ఉద్యోగం…దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భ్రుతి, రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ఈటల రాజేందర్ ప్రశ్నిస్తే…..టీఆర్ఎస్ నుండి బయటకు పంపారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని.. డబ్బును విదేశాలకు తరలించిండు. కేంద్రం నిధులిస్తే జల్సాలు చేస్తున్నరని విమర్శించారు.

రేషన్ బియ్యం డబ్బులు కేంద్రానివే. కిలోకు రూ.20లు కేంద్రమిస్తే…..రేషన్ షాపుల వద్ద కేసీఆర్ ఫొటోలు పెట్టుకోవడం సిగ్గుచేటు అని బండి సంజయ్ విమర్శించారు. టాయిలెట్ల నిర్మాణానికి కేంద్రం డబ్బులిస్తున్నా….చివరకు టాయిలెట్ల వద్ద కూడా కేసీఆర్ ఫోటోలు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం నిధులిస్తే….టీఆర్ఎస్ ఫొటోలు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నరు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. పువ్వు గుర్తుకు ఓటేయండి. ఈటల రాజేందర్ ను గెలిపించండని కోరారు. ఈటలను గెలిపిస్తేనే కేసీఆర్ అహంకారం దిగుతుంది. గడీల నుండి బయటకొస్తాడు. పేదల తరుపున కొట్లాడేది బీజేపీ మాత్రమేనన్నారు. 30న జరిగే ఎన్నికల్లో కులాలు, వర్గాలు, సంఘాలు, సంస్థల పేరుతో ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మీరందరూ ఏకమై గంపగుత్తగా పువ్వు గుర్తుకు ఓటేయ్యాలన్నారు.

హైదరాబాద్ లో వరదలొస్తే రూ.10 వేల రూపాయల సాయం నిలిపేసి బండి సంజయ్ లేఖ రాయడం వల్లే సాయం ఆగిపోయిందని కేసీఆర్ దొంగ లేఖ సృష్టించిండు. భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద ప్రమాణం చేద్దాం రా…అని సవాల్ విసిరితే తోకముడిచిన వ్యక్తి కేసీఆర్ అని బండి సెటైర్లు వేశారు. ఇప్పుడు కూడా బీజేపీ వల్లే దళిత బంధు ఆగిపోయిందని దొంగ మాటలు చెబుతున్నడు. 70 రోజులైనా ఇంతవరకు దళిత బంధు డబ్బులు పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు? దొంగ లేఖ లు సృష్టిస్తున్నరు అని విమర్శించాడు. దళిత బంధుపై యాదాద్రికి వచ్చి ప్రమాణం చేద్దాం…రా అని సవాల్ చేస్తే కేసీఆర్ నోరు మెదపడం లేదన్నారు. కందుగుల గ్రామంలో ప్రతి ఇంట్లో ఓటర్లంతా ఈటల రాజేందర్ కు ఓటేయాలి. మీ బంధు మిత్రులను కూడా పువ్వు గుర్తుకు కూడా ఓటేసేలా చేయండని పిలుపునిచ్చారు.