Homeజాతీయ వార్తలురాముడికి ఉడతా భక్తి.. మందిరం నిర్మాణానికి పారిశ్రామికవేత్తల భారీ విరాళాలు

రాముడికి ఉడతా భక్తి.. మందిరం నిర్మాణానికి పారిశ్రామికవేత్తల భారీ విరాళాలు

Ayodhya-Ram-Mandir-Donations
ఉత్తర ప్రదేశ్ లోని ఆయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి విరాళలు వెల్లువెత్తున్నాయి. గల్లీనుంచి ఢిల్లీ వరకు… పేదవాడి నుంచి పారిశ్రామికవేత్త వరకు తోచినకాడికి ఉడతా భక్తిగా చందాలు రాస్తున్నారు. రూ.100 నుంచి కోట్లల్లో విరాళాలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలో ఈ విరాళాల విషయం ఇప్పటికే వివాదంగా మారిన విషయం తెలిసిందే.. పలువురు టీఆర్ఎస్ నేతలు విరాళాలు ఇవ్వొద్దని సంచలన ప్రకటనలు చేయగా.. బీజేపీ వాళ్లు వారికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే..

Also Read: నాసిక్ టు ముంబయి.. సాగు చట్టాలపై కదం తొక్కిన మహారాష్ర్ట రైతులు

ఈ క్రమంలో కొందరు పారిశ్రామిక వేత్తలు రామ మందిరం నిర్మాణానికి రూ.కోట్లలో విరాళాలు రాస్తున్నారు. మైహోం గ్రూప్ రూ.5కోట్లు.. మేఘా గ్రూప్ రూ.6 కోట్లు.. గోకరాజు.. గంగరాజు గ్రూప్ రూ.5కోట్లు.. రాంకీ గ్రూప్ అధినేత అయోధ్య రామిరెడ్డి.. రూ.5కోట్లు.. సుజనా చౌదరి రూ.2.20 కోట్లు.. ఇలా ప్రవాహంగా విరాళాలు సాగిపోతూనే ఉన్నాయి. దేశంలోని కార్పొరేట్ కంపెనీల సంగతి ఏమోకానీ.. రాష్ర్టంలో పారిశ్రామిక వేత్తలు మాత్రం అయోధ్య రామయ్యకు రూ. కోట్లలో విరాళాలు సమర్పించుకుంటూ.. ఉడతా భక్తిని ప్రదర్శిస్తున్నారు.

Also Read: మోడీ సార్ ‘పెట్రో’ మంట.. ఆల్ టైం అత్యధికానికి చేరిక

ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం ఉన్న పారిశ్రామికవేత్తలు.. రాముడిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. తమ స్థోమతకు తగినట్లుగా… రూ. కోట్లలోనే చెల్లింపులు చేస్తున్నారు. అయోధ్య రామయ్యకు విరాళాలు ఇచ్చే విషయంలో ఏ ఒక్కనేత సైతం పార్టీబేధాలు చూపడం లేదు. ఈ మొత్తం విరాళాల సేకరణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తోంది. అదేదో తమ సొంతపార్టీ వ్యవహారం అన్న విధంగా కాషాయం నేతల హడావుడి అంతా ఇంతాకాదు. అయినప్పటికీ.. ఇతర పార్టీల నేతలు మరో విధంగా భావించకుండా రాముడికి భక్తిపూర్వకంగా ఎంతో కొంత సమర్పించుకుంటున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

పారిశ్రామికవేత్తలైన బీజేపీ నేతలు సైతం భారీ మొత్తంగా విరాళాలు అందిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు అయిన వివేక్, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తలా రూ.కోటి విరాళంగా అందించారు. పారిశ్రామిక వేత్తలు అత్యధికంగా రూ.కోటికిపైగానే విరాళాలు రాస్తున్నారు. అయోధ్య రామయ్య గుడి నిర్మాణానికి రూ.11వందల కోట్లు ఖర్చు అవుతుందని ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఆలయ నిర్మాణంలో భాగంగా ఉచితంగా సర్వే నిర్వహించడానికి ప్రయివేటు సంస్థలు ముందుకు వచ్చాయి. ఆలయ నిర్మాణంలో ప్రతీ భారతీయుడికి భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే విరాళాలు సేకరించే పనిలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే దాదాపు వంద నుంచి రెండు వందల కోట్లు రాముడి ఆలయ నిర్మాణానికి నిధులు సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. బీజేపీ నాయకులు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్ థీమ్...
Oktelugu Epaper
Exit mobile version