‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’తో వైరల్ అయిన యువకుడిపై భారీ దాడి

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన యాడ్ బ్రూక్ బాండ్ టీ పొడి ప్రకటన ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’.. ఈ యాడ్ జనాల హృదయాల్లోకి చొచ్చుకెళ్లింది. ఈ యాడ్ ను పెళ్లి భరత్ లో చెప్పి డీజే డ్యాన్స్ చేసి ఒక యువకుడు పాపులర్ అయ్యారు. అది తెగ వైరల్ కావడంతో బోలెడంత పేరు వచ్చింది. ఆ యువకుడికి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చింది. బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన పెళ్లికూతురు యాడ్ ఎంత పాపులర్ […]

Written By: NARESH, Updated On : October 19, 2021 1:19 pm
Follow us on

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన యాడ్ బ్రూక్ బాండ్ టీ పొడి ప్రకటన ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’.. ఈ యాడ్ జనాల హృదయాల్లోకి చొచ్చుకెళ్లింది. ఈ యాడ్ ను పెళ్లి భరత్ లో చెప్పి డీజే డ్యాన్స్ చేసి ఒక యువకుడు పాపులర్ అయ్యారు. అది తెగ వైరల్ కావడంతో బోలెడంత పేరు వచ్చింది. ఆ యువకుడికి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చింది. బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన పెళ్లికూతురు యాడ్ ఎంత పాపులర్ అయ్యిందో అంతకుమించి ఈ యువకుడి డ్యాన్స్ హైలెట్ అయ్యింది.

sukhibhava sharath

ఆ వీడియోతో పాపులర్ అయిన యువకుడు నల్లగుట్ట శరత్ పై తాజాగా కొందరు దుండగులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దాదాపు 10 మంది యువకులు డ్యాన్సర్ శరత్ పై కర్రలు, రాడ్ లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాంతో కన్ను వాపు రావడంతోపాటు నోరు, ముక్కు భాగంలో తీవ్ర గాయలయ్యాయి.

గతంలో తనచెల్లిని వేదిస్తున్నారని సాయి, హరి వర్గంపై శరత్ దాడి చేసినట్లు తెలిసింది. దాంతో శరత్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కొద్దిరోజుల క్రితమే శరత్ జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇటీవల ‘సుఖీభవ’ యాడ్ వీడియో వైరల్ కావడంతో ఆ పెళ్లి భరత్ లో దాన్ని చేసి శరత్ సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయాడు.

తనపై దాడిని శరత్ ఖండించారు. తాను ‘సుఖీభవ’ యాడ్ తో ఫేమస్ అయ్యానని.. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని తెలిసి కక్ష గట్టి తనపై ఓ వర్గం దాడి చేసిందని శరత్ ఆరోపిస్తున్నాడు.