Atchannaidu Audio Leak : సంచలనం.. లోకేశ్‌ యాత్రపై అచ్చెన్నాయుడు ఆడియో లీక్‌.. బయటపెట్టిన వర్మ..

Atchannaidu Audio Leak : ఒకసారి పార్టీ లేదు బొక్కాలేదు అంటూ సొంతపార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. మరోసారి పోలీసులపై బూతులు తిడతారు.. ఇలా తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాజాగా యువగళం పేరుతో చంద్రబాబు నాయకుడు తనయుడు లోకేశ్‌బాబు చేస్తున్న పాదయాత్రపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవతున్నాయి. నారా లోకేశ్‌ పాదయాత్రకు జనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఓ టీడీపీ నేతతో మాట్లాడిన ఆడియో పార్టీలో కలకలం […]

Written By: NARESH, Updated On : February 9, 2023 9:10 pm
Follow us on

Atchannaidu Audio Leak : ఒకసారి పార్టీ లేదు బొక్కాలేదు అంటూ సొంతపార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. మరోసారి పోలీసులపై బూతులు తిడతారు.. ఇలా తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాజాగా యువగళం పేరుతో చంద్రబాబు నాయకుడు తనయుడు లోకేశ్‌బాబు చేస్తున్న పాదయాత్రపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవతున్నాయి. నారా లోకేశ్‌ పాదయాత్రకు జనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఓ టీడీపీ నేతతో మాట్లాడిన ఆడియో పార్టీలో కలకలం రేపుతోంది. ఇందులో లోకేశ్‌ పాదయాత్రకు జనం తరలింపులు, కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయనే ఇద్దరి మధ్య సంభాషణ సాగింది. అయితే ఈ ఆడియోను టీడీపీ వర్గాలు మాత్రం ధృవీకరించలేదు. అయితే అచ్చెన్నాయుడు కావాలనే ఆడియో లీక్‌ చేయించారని టాలీవుడ్‌ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు.

-లోకేశ్‌ పాదయాత్రకు హైప్‌..
ఏపీలో నారా లోకేశ్‌ యువగళం పేరుతో కుప్పం నుంచి ప్రారంభించిన పాదయాత్ర పది రోజులు దాటింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న యాత్ర మొత్తం 400 రోజులు 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్రలో లోకేశ్‌ను కలిసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనికి సంబంధించి పలు ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తూ హైప్‌ తెస్తున్నారు. అయితే ఈ జనం, వాహనాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షుడు అర్చెన్నాయుడు మాట్లాడినట్లుగా చెబుతున్న సంచలన విషయాలతో ఓ ఆడియో సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ అవుతోంది.

-అచ్చెన్నాయుడి ఆడియో చాట్‌ ?
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కోఆర్డినేటర్‌ చిట్టిబాబునాయుడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడినట్లు చెబుతున్న ఆడియోలో చిట్టిబాబు నాయుడు అచ్చెన్నాయుడితో లోకేష్‌ పాదయాత్రకు సంబంధించి తాను చేస్తున్న ఏర్పాట్లను పంచుకున్నారు. తాను ఈ యాత్రకు జనాన్ని ఎలా తరలిస్తోంది, వాహనాలు ఎలా సమకూరుస్తోంది, డబ్బులు ఎలా పంచుతోంది వివరించారు. దీంతో ఆయన చెబుతున్న మాటల్ని విన్న అచ్చెన్నాయుడు పలు సూచనలు కూడా చేస్తున్నట్లు ఉంది. ఇప్పుడు ఈ ఆడియో టీడీపీ ప్రత్యర్ధులు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు.

-ఆయనే లీక్‌ చేశారంటూ ఆర్జీవీ ట్వీట్‌ !
అయితే ఈ ఆడియో లీక్‌పై టాలీవుడ్‌ దర్శక నిర్మాత రాంగోపాల్‌వర్మ స్పందించారు. ఈ మధ్య వైసీపీతో కలిసి పనిచేస్తున్న వర్మ.. అచ్చెన్నాయుడు ఆడియో లీక్‌పై ట్వీట్‌ చేశారు. ఇందులో ఈ ఆడియో లీక్‌ చేసింది 100 శాతం అచ్చెన్నాయుడే అని ఆరోపించారు. ఇప్పటికైనా లోకేష్‌ కెపాసిటీ చంద్రబాబు తెలుకోవాలని, టీడీపీని కాపాడాలని అచ్చెన్నాయుడు పన్నిన వ్యూహమే ఇది అంటూ ట్వీట్‌లో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొత్తంగా ఒకవైపు అచ్చెన్నాయుడి ఆడియో.. ఇంకోవైపు ఆర్జీవీ ట్వీట్‌ రెండూ సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అధ్యక్షుడే పార్టీ పరువు తీయడం టీడీపీలో చర్చనీయాంశమైంది.