ఆర్మీ జవాన్ అదృశ్యం..!

రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ ప్రకాష్ రైల్ గత కొంత కాలంగా హిమాచల్ ప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దీ రోజులగా అతని నుంచి ఏ విధమైన సమాచారం లేకపోవడం, అతని సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ భాజపా సంఘటనా ప్రధాన కార్యదర్శి ఎన్. మధుకర్ సమాచారాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రయ దృష్టికి తీసుకువెళ్లారు. సమాచారం అందిన వెంటనే […]

Written By: Neelambaram, Updated On : April 16, 2020 5:27 pm
Follow us on


రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ ప్రకాష్ రైల్ గత కొంత కాలంగా హిమాచల్ ప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దీ రోజులగా అతని నుంచి ఏ విధమైన సమాచారం లేకపోవడం, అతని సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ భాజపా సంఘటనా ప్రధాన కార్యదర్శి ఎన్. మధుకర్ సమాచారాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రయ దృష్టికి తీసుకువెళ్లారు.

సమాచారం అందిన వెంటనే గవర్నర్ రక్షణ శాఖ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను ప్రకాష్ రైల్ అదృశ్యంపై దర్యాప్తు చేసి వెంటనే నివేదిక ఇవ్వవలసిందిగా ఆదేశించడం జరిగింది. దీంతో రక్షణ శాఖ ఉన్నతాధికారులు మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు జరిపి ప్రకాష్ రైల్, అతనితోపాటు ఉన్న మరో జవాన్ చైనా సరిహద్దులో ఉన్న ఛోలింగ్ ప్రాంతం దగ్గర విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవ శాత్తు “సట్లెజ్ ” లోయలోకి జారిపడి అదృశ్యమైనట్లు పూహ పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైనట్లు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రకాష్ రైల్ తో బాటు విధి నిర్వహణలో ఉన్న మరో జవాను నది ఒడ్డున పడటం వలన అతన్ని అక్కడి భధ్రతా సిబ్బంది కాపాడినట్లు అధికారులు తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆదేశాల అనంతరం రక్షణ శాఖ మరియు పోలీస్ ఉన్నతాధికారులు 300 మంది సిబ్బంది తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హెలికాప్టర్, గజ ఈతగాళ్లను, థర్మల్ సెన్సార్ లను ఉపయోగించి సట్లెజ్ లోయలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గాలింపు అనంతరం అందిన సమాచారం ప్రకారం ప్రకాష్ రైల్ కు చెందిన క్యాప్ మరియు బ్యాక్ ప్యాక్ లభించినట్లు ఉన్నతాధికారులు తెలపారు. ప్రకాష్ రైల్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు కల్నల్ సి ఎస్ మఖాన్ మరియు మేజర్ ఆనంద్ లు తెలియజేశారు. ఈ దర్యాప్తు పై ఎప్పటికప్పుడు రాజ్ భవన్ కు నివేదిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని ప్రకాష్ రైల్ కుటుంబ సభ్యులకు తెలియజేశామని హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గారి వ్యక్తిగత కార్యదర్శి కైలాష్ నగేష్ తెలిపారు.