ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతోంది. పాతిక వేల కోట్ల అప్పులు చేసింది. అయితే అది తీర్చడానికి కాదు అసలు చేసిన అప్పు చేసిన విధానమే లోపభూయిష్టంగా ఉంది. వివరాలు ఎవరికి చెప్పడం లేదు. అప్పు తీసుకున్న నిర్ణయాలు నేరపూరితంగా ఉండడం గమనార్హం. అధికారులకు సైతం టెన్షన్ పట్టుకుంది. లెక్కలు చెప్పాల్సి వస్తే పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారు. ప్రమాదం ఏ రూపంలో వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
కొద్దిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈసంస్థకు మద్యం ఆదాయాన్ని బదిలీ చేసింది. దీన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి పాతిక వేల కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణంలో ఇంకా ప్రభుత్వానికి మూడున్నర వేల కోట్లు చేరాల్సి ఉంది. అరవై ఒక్క వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం తీసుకుంది. మద్యం ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా ప్రత్యేకంగా ఎస్కోృ ఖాతాకు మళ్లిస్తారు.
ప్రజల పన్నులు నేరుగా ప్రత్యేక ఖాతాకు వెళతాయి. అక్కడనుంచి అప్పులకు తిరిగి చెల్లిస్తారు. ఇలా పదిహేనేళ్ల పాటు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఇలా పన్నుల ఆదాయాన్ని ప్రత్యేకంగా మళ్లించడం చట్ట విరుద్దమని ఇప్పటికే నిపుణులు తేల్చారు. ఇప్పుడు ఈ అప్పులు తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం ఏ రికార్డుల్లోనూ చూపించడం లేదు . బడ్జెట్ పుస్తకాల్లోనూ ప్రభుత్వం అన్ని కేటగిరిలోనూ చూపించడం లేదు.
చివరికి కేంద్రం అప్పుల వివరాలు అడిగితే అందులోనూ చెప్పడం లేదు. ఇలా దాచి పెట్టడం వల్ల భవిష్యత్ లో మరిన్ని సమస్యలువస్తాయన్న ఆందోళన అధికార వర్గాల్లో ఏర్పడుతోంది. ఎందుకంటే ఈ అప్పు ప్రభుత్వం చెబుతున్న దానికంటే అదనంగా చేసింది. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి చేసిందన్నమాట. ఈ లెక్కలు బయటకు వస్తే ఏపీ ప్రభుత్వ రుణపరిమితి దాటి మరీ పాతిక వేల కోట్లు అప్పులు తీసుకున్నట్లు అవుతుంది. ఈ తరహా తప్పుడు విదానాలకు పాల్పడినందుకు కేంద్రం అధికారులనే శిక్షించే అవకాశం ఉంది.