ఏపీలో ఇద్దరు ఐఏఎస్ లపై హైకోర్టు అరెస్ట్ వారెంట్

ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినా చివరి నిమిషంలో మినహాయింపు కోరారు. మరొకరు అసలు హైకోర్టు ఆదేశాలనే బేఖాతరు చేశారు. దీంతో హైకోర్టు వారికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ శంకరాచార్యులుకు ప్రొవిజనల్ పెన్షన్, ఇతర భత్యాలను విడుదల చేయాలని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను […]

Written By: Srinivas, Updated On : July 23, 2021 4:35 pm
Follow us on

ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినా చివరి నిమిషంలో మినహాయింపు కోరారు. మరొకరు అసలు హైకోర్టు ఆదేశాలనే బేఖాతరు చేశారు. దీంతో హైకోర్టు వారికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ శంకరాచార్యులుకు ప్రొవిజనల్ పెన్షన్, ఇతర భత్యాలను విడుదల చేయాలని

గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంతో ఆయన ఈ ఏడాది ఏప్రిల్ లో హైకోర్టులో ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, అనంతరాముపై కోర్టు ధిక్కారణ కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వీరిద్దరిని కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా వీరిద్దరు హాజరు కాలేదు.

ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్న అనంతరాముతో పాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది నిన్న ఈ కోర్టు ధిక్కారణ కేసులో హైకోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ద్వివేది విదేశీ పర్యటనలో ఉన్నందున హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది నిన్న హైకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేశారు.

ఇాలా చివరి నిమిషంలో హైకోర్టులో హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలుచేయడం పట్ల న్యాయవాది జస్టిస్ దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మరో ఐఏఎస్ అనంతరాము అయితే ఎలాంటి సమాచారం లేకుండా కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో న్యాయమూర్తి ఆయన తీరుపైనా సీరియస్ అయ్యారు.

కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, అనంతరాములను తక్షణం అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచాలని హైకోర్టు గుంటూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. వీరిద్దరిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ప్రస్తుతం ద్వివేది విదేశీపర్యటనలో ఉండగా అనంతరాము మాత్రం ఏపీలోనే ఉన్నారు. దీంతో వీరిద్దరి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది.