
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల వరకు 32.74 శాతం బియ్యం కార్డుదారులకు లాక్ డౌన్ సందర్భంగా రూ. వెయ్యి ప్రత్యేక సాయం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 43,56,048 బియ్యం కార్డు దారులకు రూ. 435.60 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. 15,001 గ్రామ సచివాలయాల పరిధిలో రూ.వెయ్యి ప్రత్యేక సాయం పంపిణీలో 2, 39,159 మంది వాలంటీర్లు పాలుపంచుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 33.22 శాతం, అర్బన్ ప్రాంతాల్లో 31 12 శాతం లబ్ధిదారులకు ప్రత్యేక నగదు సాయం పంపిణీ పూర్తి చేశామని చెప్పారు.
కరోనా వైరస్ నియంత్రణ వల్ల లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన పేదలకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర లోని 1.33 కోట్ల బియ్యం కార్డుదారులకు రూ. 1330 కోట్లు కేటాయించారని, ప్రతి కార్డుదారుకు రూ.1000 అందచెయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. దారిద్ర్య రేఖ దిగువన వున్న కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి బియ్యం కార్డుదారులకు వెయ్యి నగదును వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారన్నారు.