లాక్ డౌన్ నుంచి మరికొన్నింటికి మినహాయింపు…!

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపునకు అదనంగా మరికొన్ని మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు కొత్త గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినాహాయింపు ఇచ్చింది. ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 6:11 pm
Follow us on


కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపునకు అదనంగా మరికొన్ని మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు కొత్త గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినాహాయింపు ఇచ్చింది. ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఆర్థిక రంగానికి మినహాయింపు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనుల తో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు మినహాయింపు కల్పించారు. కావల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి ఇచ్చారు. వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతించారు. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ఈ మీనాహాయింపు వర్తిస్తోందని పేర్కొన్నారు. పుస్తకాల షాపులకు, ఎలక్ట్రికల్ షాపులకు మినహాయింపు లభించింది. ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించారు. మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉంటే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి ఇచ్చినట్లు ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.