spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Govt- Debts: జీతాలు.. పెన్షన్ల తిప్పలు: ఏపీకి అప్పుల కోసం ఎంత గతిపట్టింది

AP Govt- Debts: జీతాలు.. పెన్షన్ల తిప్పలు: ఏపీకి అప్పుల కోసం ఎంత గతిపట్టింది

AP Govt- Debts: ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ఆర్థిక శాఖ అధికారులను వెంటబెట్టుకొని హస్తిన పయనమయ్యారు. డిసెంబరు నెల జీతాల కోసం అప్పులు తప్పవని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ను వేడుకోనున్నారు. ఇప్పటికిప్పుడు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు ఇవ్వకుంటే జీతాలు, పెన్షన్లు ఇవ్వలేమిని మొర పెట్టుకోనున్నారు. మరో నాలుగురోజుల వ్యవధే ఉన్నందున పర్మిషన్ ఇస్తే.. మంగళవారం నాటికి బాండ్లు వేలం వేసి కాస్తా ఆలస్యంగానైనా జీతాలు ఇచ్చుకుంటామని విన్నవించనున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల పరిమితిని ఏపీ ఏనాడో దాటిపోయింది. కానీ ప్రతీనెలా ఏపీ విన్నపాలకు కేంద్రం తలొగ్గుతోంది. ఈ నెల కూడా అదే సీన్ క్రియేట్ అయ్యే అవకాశముంది.

AP Govt- Debts
AP Govt- Debts

వాస్తవానికి ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి అప్పు రుణపరిమితి విషయంలో కేంద్రం వెసులబాటు కల్పించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది. ఇప్పటివరకూ ఈ ఏడాదిలో తెలంగాణకు రూ.20 వేల కోట్లనే అప్పు పర్మిషన్ గా ఇచ్చారు. అదే ఏపీకి మాత్రం రూ.50 వేల కోట్లకుపైగా అనుమతిచ్చారు. ఇంకా ఆర్బీఐ నుంచి కూడా అప్పు తెచ్చేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయినా ఇంకా అప్పు కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తునే ఉంది. ఇవ్వాలని కేంద్రం కాళ్లావేళ్లా పడుతోంది. అటు సెక్యూరిటీస్ వేలం వేసుకుంటామని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.

నెలకు సగటును రూ.2 వేల కోట్లు అప్పుచేస్తే కానీ గండం గడిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఆపై ఏదైనా సంక్షేమ పథకం మీట నొక్కాలంటే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనతో పాటు అధికారులు వారాలు తరబడి ఢిల్లీలో మకాం వేస్తున్నారు. అప్పులకు ఎన్ని మార్గాలు ఉన్నాయో.. అన్నింటినీ అన్వేషిస్తున్నారు. బ్యాంకు లూప్ హోల్స్ తెలిసిన మాజీ అధికారులకు సలహాదారులుగా నియమించి మరీ అప్పుల కోసం రంధ్రాన్వేషణ చేస్తున్నారు. అయితే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని మినహాయింపులకు ఏపీకి లభిస్తుండడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

AP Govt- Debts
AP Govt- Debts

ఏపీలో జగన్ సర్కారు బీజేపీతో కానీ.. కేంద్రపెద్దలతో కానీ ఎప్పుడూ ఘర్షణ వాతావరణంలో వెళ్లలేదు. వీలైనంతవరకూ స్వామిభక్తి ప్రదర్శిస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న విశాఖ టూర్ లో కూడా ప్రధాని మోదీని సార్ సార్ అంటూ జగన్ వినమ్రత ప్రదర్శించారు. అటు ప్రధాని పర్యటనను తన సొంత పార్టీ మాదిరిగా భావించి ఏర్పాట్లు చేశారు. అయితే ఏది ఎలా ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగానే భావించాలి. అభివృద్ధి పనులకు ఇతోధికంగా నిధులు అందించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టారాజ్యంగా అప్పులకు అనుమతివ్వడం అంటే.. ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను అంధకారంలో నెట్టడమేనన్న విషయాన్ని గుర్తెరగాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper