https://oktelugu.com/

సెప్టెంబర్ వరకూ సీఎస్ గా సాహ్ని..!

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపునకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ 30వ తేదీన సీఎస్ పదవి విరమణ చేయాల్సి ఉంది. జులై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ మూడు నెలల పాటు ఆమె పదవి కాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ […]

Written By: , Updated On : June 3, 2020 / 05:44 PM IST
Follow us on

Neelam Sahni

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపునకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ 30వ తేదీన సీఎస్ పదవి విరమణ చేయాల్సి ఉంది. జులై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ మూడు నెలల పాటు ఆమె పదవి కాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖను పరిగణలోనికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సీఎస్ పదవీ కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను పాటిస్తూ వివాద రహితంగా పనిచేస్తుండటంతో సీఎస్ పదవీ కాలాన్ని పొడిగింపునకు సీఎం కేంద్రానికి లేఖ రాశారు. గతంలోనూ సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా టక్కర్ పదవి కాలాన్ని పెంచారు. రమాకాంత్ రెడ్డి తదితరులు పదవీ కాలం పొడిగింపు పొందిన వారిలో ఉన్నారు.