
2020-21 ఏపీలో వ్యవసాయ బడ్జెట్ ఆ శాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో మంగళవారం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ.29,159.97 కోట్లను ప్రతిపాదించారు. గతేడాది కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని, దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి 13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
* ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు
* రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు
* వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.500 కోట్లు
* వైఎస్ఆర్ వడ్డీ లేని పంట రుణాలను రూ.1,100 కోట్లు
* రైతులకు ఎక్స్ గ్రేషియోకు రూ.20 కోట్లు
* రాయితీ విత్తనాల కోసం రూ.200 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ.207.83 కోట్లు
* ప్రకతి వ్యవసాయానికి రూ.225.51 కోట్లు
* ప్రకతి విపత్తు నిధి రూ.2,000 కోట్లు
– పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.92.18 కోట్లు
– ఉద్యానవన అభివృద్ధికి రూ.653.02 కోట్లు
– పశుసంవర్ధకశాఖకు రూ.854.77 కోట్లు
– వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీకి రూ.88.60 కోట్లు
– ఎన్జి రంగా వర్సిటీకి రూ.402 కోట్లు
– వెంకటేశ్వర పశు వైద్యశాలకు రూ.122.73 కోట్లు
– మత్స్యశాఖ అభివృద్ధికి రూ.299.27 కోట్లు
– సహకార శాఖకు రూ.248.38 కోట్లు
– వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.4,450 కోట్లు
– వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి రూ.6,270 కోట్లు