Homeఆంధ్రప్రదేశ్‌Atrocity In Podugupalem: జేసీబీతో వృద్ధురాలిని తొక్కించి చంపారు.. ఏపీలో రావణ రాజ్యం

Atrocity In Podugupalem: జేసీబీతో వృద్ధురాలిని తొక్కించి చంపారు.. ఏపీలో రావణ రాజ్యం

Atrocity In Podugupalem: యథా రాజా తథా అధికారి అని చదువుకోవాలేమో? తాతల కాలం నుంచి రైతుల చేతిలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాక్షసంగా మారింది. పేదల నుంచి భూములు లాక్కునేందుకు ఇదే ధోరణి అనుసరిస్తారా? వైఎస్ జగన్ సర్కారు చేసిన పనికి ఓ మహిళ తనువు చాలించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి దురాగాతాలకు తెగబడటం అందరిలో అసహ్యం కలిగేలా చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? రాక్షస పాలన కొనసాగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో చోటుచేసుకున్న ఉదంతం అందరికి భయాందోళన కలిగేలా చేసింది.

Atrocity In Podugupalem
Atrocity In Podugupalem

ప్రభుత్వం నేతృత్వంలోనే దాడులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల కోసం ప్రభుత్వం ఉందా? భూములు లాక్కోవడమే తమ హక్కుగా భావిస్తుందా తెలియడం లేదు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని పొడుగుపాలెం గ్రామంలో జరిగిన దారుణం అందరిలో ఆవేశం కలిగేలా చేస్తోంది. ప్రభుత్వ అధికారులే దగ్గరుండి జేసీబీతో ఓ మహిళ మృతికి కారణం కావడం సంచలనం కలిగించింది. స్థలం లాక్కునేందుకు అవసరమైతే ప్రాణాలు కూడా తీసేందుకు సిద్ధమనే కోణంలో వారి ప్రవర్తన ఉండటం గమనార్హం.

గ్రామంలో అంగన్ వాడీ భవన నిర్మాణానికి ఓ స్థలం చూశారు. అది రైతుల చేతుల్లో ఉంది. రైతులు తమ ఎడ్లను కట్టేసుకునే పశువుల పాకగా చేసుకుని స్థలాన్ని వారి తాతల కాలం నుంచి వాడుకుంటున్నారు. అయితే ఇటీవల అధికారులు అది ప్రభుత్వ స్థలం అంటూ దాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారయంత్రాంగంతో వచ్చారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ స్థలం తమదేనంటూ వాదానికి దిగారు. దీంతో అధికారులు జేసీబీతో పనులు చేపట్టారు. దీనికి అడ్డు తగిలిన ఎల్లమ్మ అనే మహిళను దాంతోనే తొక్కించి చంపేశారు.

Atrocity In Podugupalem
Atrocity In Podugupalem

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అధికార యంత్రాంగం ఇంతకు తెగిస్తుందా? అని స్థానికులు ఆందోళన చెందారు. మహిళ ప్రాణాలు పోయేలాచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అధికారుల కండ కావరానికి పరాకాష్టగా చెబుతున్నారు. వైఎస్ జగన్ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ నిర్వాకం వివాదాలకు కేంద్రంగా మారింది.

దీనిపై జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తహసీల్దార్ రామారావు పేర్కొన్నారు. భూమి చదును చేస్తుంటే ఆమె కావాలనే దానికి అడ్డంగా వెళ్లడంతో ప్రమాదవశాత్తు ఆమె చనిపోయిందని అన్నారు. స్థానికులు అడ్డు వచ్చినా పనులు కొనసాగించడంతో వృద్ధురాలు చనిపోయిందని చెప్పారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version