అమరావతి ఉద్యమం.. ఇక వైసీపీ వంతు..

ఏపీ రాజధానికిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. టీడీపీ ఆధ్వర్యంలో 460 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. లాఠీల జోరుగా.. బూట్ల చప్పుళ్లతో ఇక్కడి గ్రామాలు నిత్యకృత్యంగా మారాయి. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారన్నా.. చాలా అడ్డంకులే. రాజధాని అంటే మనకు సంబంధించింది కాదు.. అది అక్కడి గ్రామాల సమస్య అన్నట్లుగా రాష్ట్ర ప్రజలు మరో వైపు నడిచారు. అధికారంలోకి వచ్చింది మొదలుకుని రాష్ట్రాభివృద్ధి కోసం మూడు రాజాధానులంటూ.. ప్రకటన చేసి ఇక్కడి నుంచి ఎంత త్వరగా […]

Written By: Srinivas, Updated On : March 24, 2021 2:30 pm
Follow us on


ఏపీ రాజధానికిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. టీడీపీ ఆధ్వర్యంలో 460 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. లాఠీల జోరుగా.. బూట్ల చప్పుళ్లతో ఇక్కడి గ్రామాలు నిత్యకృత్యంగా మారాయి. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారన్నా.. చాలా అడ్డంకులే. రాజధాని అంటే మనకు సంబంధించింది కాదు.. అది అక్కడి గ్రామాల సమస్య అన్నట్లుగా రాష్ట్ర ప్రజలు మరో వైపు నడిచారు.

అధికారంలోకి వచ్చింది మొదలుకుని రాష్ట్రాభివృద్ధి కోసం మూడు రాజాధానులంటూ.. ప్రకటన చేసి ఇక్కడి నుంచి ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్దామా అనే ప్రయత్నాలతో వైసీపీ ప్రభుత్వం. ఇటువంటి తరుణంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం భుజాన వేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం.. రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఆ తరువాత ప్రభుత్వాలు గౌరవించాలి. రైతులకు ఇవ్వాల్సిన అన్ని రకాల పరిహారాలు చెల్లించాలి.

అయితే అసైన్డ్ భూముల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయంటూ.. సీఐడీకి ఫిర్యాదు చేసిన మంగళరిగి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని ఉద్యమానిక కొత్త ఊతం ఇచ్చారు. రైతులకు ఆయనే స్వయంగా కొత్త అస్ర్తాలు అందించారు. ఎస్సీ, ఎస్టీ భూములను రాజధాని నిర్మాణంకోసం తీసుకున్న సమయంలో వారి హక్కులకు ఎలాంటి భంగం కలిగించకూడదని సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం.. రాజధానిలోని ఎస్సీ, ఎస్టీ రైతులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకూడదు.

వాస్తవానికి సీఐడీ ముందు వాగ్మూలం ఇచ్చిన అన్నదాతలు గత ప్రభుత్వం తమను వేధించలేదని చెప్పారు. కేసులకోసం స్టేషన్లకు తిప్పుతూ.. దళిత రైతులను ఇప్పుడున్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఎలా వేధిస్తున్నారోనన్న విషయం బయటపడింది. అధికార పార్టీ ఎమ్మెల్యే లేవనెత్తిన విషయం ఆధారంగా వైసీపీ ప్రజాప్రతినిధులపై కేసువేసే అవకాశం రైతులకు దొరికింది. మాజీ సీఎం చంద్రబాబును ఏదోకేసులో ఇరికించి జైలుకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం అదే క్రమంలో తనకు తెలియకుండా అమరావతి ఉద్యమాన్ని భుజానవేసుకుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి..?