ఆంధ్రప్రదేశ్‌మరో ఉద్యమం చేపట్టిన రాజధాని రైతులు..!

మరో ఉద్యమం చేపట్టిన రాజధాని రైతులు..!


అమరావతిలోని రైతులు రాజధానికి ఏ మూహూర్తంలో భూములు ఇచ్చరో గాని కొంత కాలంగా వారు ఉద్యమాల పేరుతో రోడ్లకే పరిమితం అవుతున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని 252 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం విధితమే. తాజాగా మరో ఉద్యమానికి రైతులు చేపట్టారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా ప్రభుత్వం కౌలు చెల్లించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అంశాలకు ప్రధమ ప్రాధాన్యత దక్కేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి తారుమారు అయ్యింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే జూన్ నాటికి కౌలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకూ కౌలు చెల్లించలేదు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యేపై కోర్టుకెక్కిన పార్టీ నాయకులు..!

దీంతో రాజధాని రైతులు మరోమారు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ ను కలిసి కౌలు చెల్లించాలని కోరడానికి రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటీకీ కొందరు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకోవడం అక్కడ మరి కొందరిని అరెస్టు చేసి సింగ్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీరికి మద్దతుగా వచ్చిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు.

రాజధానిలో 22 వేల మంది రైతులు సుమారు 32 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. జరీబు భూములకు రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మెట్ట భూముల రైతులకు ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఏటా కౌలు చెల్లించాలని ప్రభుత్వం ఒప్పందం, అదే విధంగా కౌలు ఏటా పది శాతం పెంచాల్సి ఉంది. ఏటా కౌలు రూపంలో రూ.189 కోట్లు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం మూడు నెలలగా రైతులు కౌలు చెల్లించలేదు.

Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

కౌలు చెల్లిస్తే రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం కావాలనే కౌలు చెల్లింపులో జాప్యం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర సంక్షేమ పథకాలకు రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలు రూ.189 కోట్లు విడుదల చేయడంలో జాప్యం చేయడం పెద్ద విషయమేమీ కాదనేది వీరి భావన.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Amaravati Capital: అమరావతి కోసం సంకల్పం.. అడుగడుగునా ఆటంకం!

Amaravati Capital: తెలంగాణ ఉద్యమం ప్రాంతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఆ సమయంలో పార్టీల, వర్గాల ఒక లక్ష్యం కోసం కట్టుబడ్డారు. ఆ యుద్ధ భావననతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. ఆంధ్రాప్రాంత ప్రజలు...

Roja: అమరావతి , మావిగన్ ఒకటే.. తేల్చేసిన రోజా

Roja: రోజా ఇలా మాట్లాడుతుందని.. ఒక మాటలోనే గాలి తీసేస్తుందని వైసీపీ నేతలు కలలో కూడా ఊహించి ఉండరు. రోజా ఆ మాట అనడం.. ఆ వీడియోలో క్షణాల్లోనే వ్యాప్తి కావడం.....

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version