ప్రజలకు అలెర్ట్: సెకండ్‌ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనా

చైనాలోని వూహాన్‌లో గతేడాది నవంబర్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచం మొత్తంలో అమెరికాపై ఈ వైరస్‌ ప్రభావం బాగా చూపించింది. ఇప్పటి వరకు అమెరికాలో 90 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానంలో ఇండియానే ఉంది. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు ప్రస్తుతం దేశంలో 81 లక్షలకు కరోనా కేసులు చేరాయి. అయితే కరోనా ప్రారంభంలో లాక్‌డౌన్‌తో కట్టడి చేసినా ఆ తరువాత ఏమాత్రం ఆగకుండా […]

Written By: NARESH, Updated On : October 30, 2020 4:43 pm
Follow us on

చైనాలోని వూహాన్‌లో గతేడాది నవంబర్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచం మొత్తంలో అమెరికాపై ఈ వైరస్‌ ప్రభావం బాగా చూపించింది. ఇప్పటి వరకు అమెరికాలో 90 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానంలో ఇండియానే ఉంది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

ప్రస్తుతం దేశంలో 81 లక్షలకు కరోనా కేసులు చేరాయి. అయితే కరోనా ప్రారంభంలో లాక్‌డౌన్‌తో కట్టడి చేసినా ఆ తరువాత ఏమాత్రం ఆగకుండా వైరస్‌ వేగంగా విస్తరించింది. అయితే గత కొద్దిరోజులగా కరోనా కేసులు తగ్గుతున్నాయనుకుంటున్న సమయంలో ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ ఆందోలనకు గురి చేస్తోంది.

Also Read: భారత బలగాలను చూసి పాక్‌ సైన్యం, అధికారులు వణికిన వేళ..

తాజాగా బ్రిటన్‌లో మొదటి సారి కంటే రెండోసారే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. లండన్‌ శాస్త్రవేత్ల ప్రకారం అక్టోబర్‌ 16 నుంచి 25వ తేదీ మధ్యలో దేశవ్యాప్తంగా 85 వేల మంది నమునాలు సేకరించారు. ఇందులో ప్రతి పదివేల మందిలో 128 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తేలింది. అక్టోబర్‌ మొదటివారంలో ఈ సంఖ్య కేవలం 60 మాత్రమే కావడం గమనార్హం.

Also Read: అమెరికా వీసా మరింత కఠినం: హెచ్‌-1బి లాటరీ పద్ధతికి స్వస్తి..!

వాతావరణంలో మార్పులు రావడంతో పాటు చలికాలం సమీపించిన నేపథ్యంలో ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా ఎక్కువవడంతో కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ప్రాన్స్‌లో అక్టోబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 1 వరకు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొదటిసారి కంటే రెండోసారి కరోనా విజృంభణ జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.