Homeజాతీయ వార్తలుAirtel : ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్.. కొత్త వై-ఫైపై రూ.700 డిస్కౌంట్!

Airtel : ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్.. కొత్త వై-ఫైపై రూ.700 డిస్కౌంట్!

Airtel : ఇంట్లో లేదా ఆఫీసు కోసమని కొత్తగా వైఫై కనెక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా.. ? అలాంటి వారికో గుడ్ న్యూస్. దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే దాని మీద ఏకంగా రూ.700వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఐపీఎల్ జోష్‌లో ఎయిర్‌టెల్ ధమాకా
ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ క్రికెట్ ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో భాగం. ఐపీఎల్ 2025 సందడి పెరుగుతున్న క్రమంలో ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, బ్రాడ్ బ్యాండ్ యూజర్ల కోసం స్పెషల్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ గురించి పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకందాం.

Also Read : దూసుకొచ్చిన ఎయిర్ టెల్ 5జీ స్పీడ్.. ఈ ప్లాన్ తో జియోను దాటేస్తోందా?

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్ ఏమిటి?
ఈ డిస్కౌంట్ కేవలం కొత్త బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం మాత్రమే అని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. మొదటిసారి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ తీసుకుని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే, దాని మీద రూ.700 వరకు తగ్గింపు పొందవచ్చు.

డిస్కౌంట్ ఎలా పొందాలి?
ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌ను లేదా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను సందర్శించి కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను బుక్ చేసుకోవాలి. అయితే, ఈ సదుపాయం కొన్ని సెలక్ట్ చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి, మీ సిటీ లేదా ప్రాంతంలో ఈ సర్వీసు ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్రత్యేకతలు
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 100 Mbps నుంచి 1 Gbps వరకు ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. దీనితో పాటు కంపెనీ ఉచిత వై-ఫై రూటర్, ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ సిబ్బంది మీ ఇంటికి వచ్చి స్వయంగా రూటర్‌ను ఇన్‌స్టాల్ చేసి వెళ్తారు. వాళ్లు ఒక్క రూపాయి కూడా ఫిట్టింగ్ ఛార్జీలను వసూలు చేయరు. అంతేకాదు, ఎయిర్‌టెల్ కొన్ని ప్లాన్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఉన్నాయి. దీని కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా చురుగ్గా ఉంటుంది. కంపెనీ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ 24×7 అందుబాటులో ఉంటుంది.

ఇది ఒక లిమిటెడ్ టైం ఆఫర్, ఐపీఎల్ సీజన్ 2025 ముగిసే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి, కొత్త బ్రాడ్‌బ్యాండ్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే అలాంటి వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు.

Also Read : రెండేళ్లకే తగ్గిన స్పీడు.. జియో, ఎయిర్ టెల్ ఎందుకు విఫలమవుతున్నాయి? కారణం ఏంటి?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version