నేడే బాబ్రీ కేసు తీర్పు: అద్వానీ, జోషి, ఉమాభారతిల్లో వణుకు..

దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. రామజన్మభూమిని సాధించింది. కానీ అదే స్థలం కోసం పోరాడి తమ జీవితాన్ని ధారపోసిన ఆ పార్టీకి చెందిన సీనియర్ కురువృద్ధుల భవితవ్యం నేడు తేలనుంది. ఈరోజు  బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్ కే యాదవ్ ఈ తీర్పును ప్రకటించనున్నారు. దశాబ్ధాలుగా బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, జోషి సహా పలువురిని వెంటాడుతున్న ‘బాబ్రీ మసీదు కూల్చివేత కేసు’ తీర్పు ఎలా వస్తుందనే […]

Written By: NARESH, Updated On : September 30, 2020 10:32 am

babri case

Follow us on


దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. రామజన్మభూమిని సాధించింది. కానీ అదే స్థలం కోసం పోరాడి తమ జీవితాన్ని ధారపోసిన ఆ పార్టీకి చెందిన సీనియర్ కురువృద్ధుల భవితవ్యం నేడు తేలనుంది. ఈరోజు  బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్ కే యాదవ్ ఈ తీర్పును ప్రకటించనున్నారు. దశాబ్ధాలుగా బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, జోషి సహా పలువురిని వెంటాడుతున్న ‘బాబ్రీ మసీదు కూల్చివేత కేసు’ తీర్పు ఎలా వస్తుందనే ఉత్కంఠ మొదలైంది. దీంతో బీజేపీ కురువృద్ధుల్లో టెన్షన్ మొదలైంది.

Also Read: ఏపీలో ఆలయాలపై దాడుల వెనుక అసలు నిజమిది?

బాబ్రీ మసీదు కూల్చివేతల ఈ కేసులో నిందితులందరూ అద్వానీ, జోషి, ఉమాభారతి సహా 32మంది తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

1992 డిసెంబర్ 6న  బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని తాజాగా సుప్రీం కోర్టు శనివారం ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తుది తీర్పును వెలువరించాలని కోర్టు స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఎల్ కే అద్వానీ సహా బీజేపీ సీనియర్లు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. గతంలో సుప్రీం కోర్టు ఆగస్టు 31వరకు గడువు పొడిగించింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ (92), అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ లు విచారణను ఎదుర్కొంటున్నారు. వీరే కరసేవకులను రెచ్చగొట్టి బాబ్రీ మసీదును కూల్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 29 ఏళ్లుగా కోర్టుల్లో దీనిపై విచారణ సాగుతోంది.

Also Read: గంటకు రూ.90కోట్లు.. దేశంలోనే కుబేరుడిగా అంబానీ

సీబీఐ వీరందరినీ విచారించి వాంగ్మూలం స్వీకరించింది. కేసు విచారణ తుదిదశలో ఉన్న నేపథ్యంలో నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 30న తుది తీర్పులు వెలువడాల్సి ఉండడంతో బీజేపీ సీనియర్లలో ఆందోళన మొదలైంది.