spot_img
Homeఆంధ్రప్రదేశ్‌అమరావతి భూకుంభకోణం కేసులో ఏసీబీ దూకుడు... ఆ ఎమ్మెల్యేలకు షాక్....?

అమరావతి భూకుంభకోణం కేసులో ఏసీబీ దూకుడు… ఆ ఎమ్మెల్యేలకు షాక్….?

acb speed up investigation on amaravati scam

ఏపీలో రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఏసీబీ ఇప్పటికే విచారణ జరిపి ప్రాథమిక నివేదికల ఆధారంగా దర్యాప్తు విషయంలో ముందడుగులు వేస్తోంది. తాజాగా ఏసీబీ మరింత దూకుడు పెంచింది.

Also Read : నేలవిడిచి సాము చేస్తున్న జగన్

కొందరు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లు, రాజకీయ ప్రముఖులు, టీడీపీ సన్నిహితులు, పలువురు నేతల బినామీలు అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. కొన్ని ప్రముఖ కంపెనీలు సైతం భూములు కొనుగోలు చేశాయని… ఆ కంపెనీలకు టీడీపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ప్రకటన సెప్టెంబర్‌ 3, 2015న జరిగింది.

అయితే 2014లోనే అసైన్డ్ భూముల చట్టం, ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించినట్టు నిర్ధారణ అయింది. ఏసీబీ అధికారులు ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీగా మార్పులు చేర్పులు జరిగినట్లు గుర్తించారు. భూములు కొనుగోలు చేసిన వాళ్లలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, మంత్రులు కూడా ఉండటం గమనార్హం. ఏసీబీ దర్యాప్తులో ప్రముఖంగా ముగ్గురు మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి.

అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇందుకు సంబంధించిన నివేదికను అందజేయగా సిట్‌ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏసీబీ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు కావడం గమానార్హం.

Also Read : పవన్ కు అవమానం.. పోలీస్ గడపతొక్కిన జనసేన

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version