spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Land Mafia: జనసైనికుల మాజాకా.. వేల కోట్ల భూ స్కాం వెలికితీశారిలా?

Land Mafia: జనసైనికుల మాజాకా.. వేల కోట్ల భూ స్కాం వెలికితీశారిలా?

Land Mafia: జనసేన సైనికులు ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఇప్పటికే అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల ఆక్రమణకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైసీపీ నేతల ఆగడాలపై జనసైనికులు గళం విప్పారు. సర్కారు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇంతటి నీచమైన పనులు చేయడానికి కూడా వెనకాడటం లేదంటే దాని పతనం మొదలైందని చెబుతున్నారు.

Land Mafia
Land Mafia

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ అండదండలతో భూకబ్జాల భాగోతం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తమదే ప్రభుత్వం కావడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. స్థలం కనబడితే చాలు ఆక్రమణలు యథేచ్ఛగా చేస్తున్నారు. అడిగే వాడు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. పరిస్థితి చేయిదాటి పోవడంతో ఇక చేసేది ఏమీ లేదని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వం మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి రావడంతో విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విశాఖలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా భావించి వైసీపీ నేతలు ప్రభుత్వ స్థలాలపై కన్నేశారు. వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. విషయం కాస్త జనసేన పార్టీ నేతలకు తెలియడంతో వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నగరంలోని దసపల్లా లే అవుట్ సర్వే నెంబర్లలో 1196, 1197, 1027, 1028లలో 60 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 40 ఎకరాలు జీవీఎంసీ, వుడా, తూర్పు నావికాదళం తీసుకోగా ఐదు ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని భావించింది.

Land Mafia
Land Mafia

ఇక్కడ 15 ఎకరాల భూమి కొన్నేళ్లుగా వివాదాల్లో చిక్కుకుంది. 2001లో సర్వే శాఖ దసపల్లా భూములను 22ఏలో చేర్చి జీవో 657 జారీ చేశారు. వీటిని కాజేయాలని కొందరు పన్నాగం పన్నారు. ఇప్పటికే పెండింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్, ఎల్ ఎల్ పీ కంపెనీల పేరిట కాజేయాలని పథకం రచించారు. ఇక్కడ 15 అంతస్తుల భవనం నిర్మించాలని ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో చీకటి ఒప్పందాలు కుదరడంతో ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నట్లు వెలుగులోకి రావడంతో జనసేన సైనికులు స్పందించారు.

ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చౌక ధరలకు భూములను కొట్టేసి భారీ భవనాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం తమదేననే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు భూమికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. జనసేన పార్టీ ఒత్తిడితో సర్కారు భూమికి రక్షణ కలుగుతుందని భావిస్తున్నారు. అక్రమంగా కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper