spot_img
Homeజాతీయ వార్తలుJammu And Kashmir Terrorist Attack: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి దాడి.. కశ్మీర్‌లో ఉగ్ర...

Jammu And Kashmir Terrorist Attack: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి దాడి.. కశ్మీర్‌లో ఉగ్ర పంజా.. ముష్కరుల దాడిలో దారుణం

Jammu And Kashmir Terrorist Attack: భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్‌. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో పదేళ్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. సుప్రీం కోర్టు తీర్పుతో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. ఒమర్‌ అబ్దుల్లా పది రోజుల క్రితం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పది రోజులు ప్రశాంతంగానే ఉంది. కానీ, ఉగ్ర మూకలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. సామాన్యులే టార్గెట్‌గా జరిగిన ఈ దాడిలో ముష్కరులు ఏడుగురిని హతమార్చారు. శ్రీనగర్‌–లేహ్‌ జాతీయ రహదారిపై టన్నెల్‌ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికుతరులను చంపేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పనులు చేస్తున్న స్థానికులు, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, ఐదుగురు ఆస్పత్రిలో మరణించారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతా ప్రశాంతంగా ఉంటుందని, ప్రజలకు రక్షణ కల్పిస్తామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వం ప్రకటించిన వారం రోజులకే సామాన్యులపై దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మృతులు వీరే…
ముష్కరుల దాడిలో మృతిచెందినవారిలో డాక్టర్‌ షెహనవాజ్‌తోపాటు కూలీలు ఫహీమ్‌ నజీర్, ఖలీం, మహ్మద్‌ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్‌ శుక్లా, గుర్మిత్‌ సింగ్‌గా గుర్తించారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఘటన స్థలాన్ని దిగ్బంంధించాయి. ఉగ్రవాదులను పట్టించుకునరేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. కశ్మీర్‌ ఐజీ వీకే.బిర్డి ఇతర అధికారులు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

దాడిని ఖండించిన అమిత్‌షా..
ఇదిలా ఉండగా కశ్మీర్‌లో ఉగ్రదాడిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా ఖండించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారరం బుల్లెట్‌ గాయాలతో మృతిచెందిన బిహార్‌ కార్మికుడి మృతదేహాన్ని షోపియాన్‌ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే మరో ఉగ్రదాడి జరిగింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Oktelugu Epaper