Homeజాతీయ వార్తలు70 lakh voters removed in West Bengal: బెంగాల్‌లో 70 లక్షల ఓటర్లు ఔట్‌.....

70 lakh voters removed in West Bengal: బెంగాల్‌లో 70 లక్షల ఓటర్లు ఔట్‌.. మమత గేమ్‌ ఓవర్‌

70 lakh voters removed in West Bengal: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా శుద్ధీకరణ.. పశ్చిమబెంగాల్‌లో మమత బెనర్జీ ప్రభుత్వానికి ఒక సావాల్‌గా మారింది. ఇంతకాలం వలస ఓటర్లును నమ్ముకుని గెలిచిన మమతాబెనర్జీ నేతత్వంలోని తణమోల్‌ కాంగ్రెస్‌ పార్టీకి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌తో కష్టాలు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బెంగాల్‌లో రెండు విడతల్లో సర్‌ పూర్తయింది. ఇందులో 70 లక్షల ఓట్లు తొలగించారు. దీంతో మమతా బెనర్జీ నేతత్వంలోని టీఎంసీ బలహీనపడుతున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి.

ఓటర్ల తొలగింపు ఇలా..
స్పెషల్‌ ఇన్‌సెంటివ్‌ రివిజన్‌ ద్వారా నకిలీ, అనుమానాస్పద పౌరసత్వ ఓట్లు తొలగిస్తున్నారు. బెంగాల్‌లో ఇప్పటి వరకు నిర్వహించిన రెండు విడతల సర్వేలో ప్రతీ నియోజకవర్గంలో 20–25 వేల ఓట్లు తగ్గాయి. రెండు విడతల్లో 70 లక్షలు ఇప్పటికే తొలగాయి. మమతా నియోజకవర్గంలోనే 45 వేల ఓట్లు తగ్గడం గమనార్హం.

మరిన్ని ఓట్లు తొలగించే అవకాశం..
లాజికల్‌ డిస్క్రెపెన్సీలు గుర్తించి మరిన్ని ఓట్లు తొలగించే అవకాశం ఉంది. 1.26 కోట్ల ఓటర్లలో సగం ఓట్లు తొలగించే అవకాశం ఉంది. జుడీషియల్‌ అధికారులు జోక్యం చేసుకున్న తర్వాత గోస్ట్‌ ఓటర్లు బయటపడుతున్నాయి. ఈ మార్పులు టీఎంసీ బలాలను బలహీనపరుçస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో పోటీ పోటీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలతో ప్రయోజనం పొందుతూ బలపడుతోంది. సుప్రీం కోర్టు మద్దతుతో ఈ ప్రక్రియ పారదర్శకతను పెంచుతోంది.

ఓటర్ల శుద్ధి ఎన్నికల నమ్మకాన్ని పెంచినప్పటికీ, టీఎంసీకి రాజకీయ నష్టం ఖాయం. పోటీ పార్టీలు ఈ అవకాశాన్ని వాడుకుంటూ, నిజమైన ఓటర్ల ఆకర్షణపై దష్టి పెడుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర రాజకీయాల్లో తారుమారు సంభవించే అవకాశం ఎక్కువ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version