spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో 31 మంది కరోనా యోధులకు వైరస్

ఏపీలో 31 మంది కరోనా యోధులకు వైరస్


ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కట్టడికోసం ముందుండి పోరాడుతున్న వారిలో31 మందికి వైరస్ కు గురయ్యారు. వారిలో క‌రోనా రోగులకు చికిత్స ఇస్తున్న 12 మంది డాక్ట‌ర్లు, 12 మంది న‌ర్సులు, ఏడుగురు పారిశుధ్య కార్మికులు ఉన్నార‌ని ఆరోగ్య శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్రెట‌రీ జ‌వ‌హ‌ర్ రెడ్డి వెల్లడించారు.

అలాగే రాజ్ భవన్ లో న‌లుగురికి కరోనా పాజిటివ్ రావడం తెలిసిందే. దానితో గవర్నర్ దంప‌తుల‌కు కూడా టెస్ట్ చేశామ‌ని, వారికి నెగటివ్ వచ్చిందని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో కీలకమైన ఒక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న అటెండర్ కు కూడా పాజిటివ్ రావడంతో అక్కడ ఆపనిచేస్తున్న ఉద్యోగులు అందరు ఖంగారు పడుతున్నారు.

రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన పరీక్షల్లో 73 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసులు 1332 కాగా.. 287 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 31 మరణించారు. ప్రస్తుతం 1014మంది చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కువగా 29 కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి.

దానితో ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 283 కాగా, కర్నూల్‌లో 343, కృష్ణా 236, నెల్లూరు 82, చిత్తూరు 77, కడప 69, ప్రకాశం 60, పశ్చిమగోదావరి 56, అనంతపురం 58, తూర్పుగోదావరి 40, విశాఖ 23, శ్రీకాకుళం జిల్లాలో 05 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్త కేసులన్నీ కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచే వస్తుండటం గమనార్హం.

‘ప్రతి పదిలక్షల మందికిగానూ 1504 పరీక్షలు చేస్తూ దేశంలోనే ముందంజలో ఉన్నాం. పాజిటివ్‌ కేసులు దేశంలో సగటున 4.13 శాతం ఉంటే, రాష్ట్రంలో 1.57 శాతమే. మరణాల రేటు జాతీయస్థాయిలో 3.19 శాతం ఉంటే.. రాష్ట్రంలో 2.46 శాతమే’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version