
139మంది రేప్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. రోజుకో ట్వీస్టు వెలుగుచూస్తుండటంతో ఈ కేసు వివరాలను తెలుసుకునే ప్రజలంతా ఆసక్తి చూపుతున్నారు. 139మంది తనను అత్యాచారం చేశారని తొలి నుంచి బాధితులు ఆరోపిస్తూ వస్తోన్న బాధితురాలు సడన్ గా మాటమార్చడం వెనుక అంతర్యం ఏంటనే చర్చ జరుగుతోంది. ఇటీవల మీడియా ముందుకొచ్చిన బాధితులు తనను 139మంది రేప్ చేయలేదని చెప్పి అందరికీ షాక్ కు గురిచేసింది.
డాలర్ బాయ్ తనను బెదిరించడంతోనే సెలబ్రెటీలైన యాంకర్ ప్రదీప్, సినీనటుడు కృష్ణుడి పేర్లను చెప్పినట్లు వెల్లడింది. ఇక 139మందిలోనూ 40శాతం మంది అమాయకులే ఉన్నారని.. తన వల్ల వారంతా ఇబ్బందులు పడ్డారని చెప్పింది. వారికి తాను క్షమాపణ చెబుతున్నా అంటూ మీడియా ముఖంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాలర్ బాయ్ మరో పోలీసులకు మరో ట్వీస్ట్ ఇచ్చాడు.
కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని డాలర్ భాయ్ మరో డ్రామాకు తెరతీయడం ఆసక్తికరంగా మారింది. వారి నుంచి తాను తప్పించుకొని తిరుగుతున్నానని సెల్ఫీ వీడియో తీసి మీడియా ఛానళ్లకు పంపాడు. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని ఏసీపీ కాల్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా బాధిత యువతీ తనకు మ్యాట్రిమోనిలో పరిచమైందని.. తన కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా పని చేసిందని చెప్పాడు.
ఇక తన సర్టిఫికెట్లను ఎవరూ తీసుకెళ్లలేదని.. అందర్ని నమ్మించడానికే ఆమె సర్టిఫికెట్లు రజనీచౌదరికి ఇచ్చినట్లు వీడియో తెలిసినట్లు పేర్కొన్నాడు. ఇక తనను పోలీసులు బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని డాలర్ బాయ్ చెప్పాడు. కాగా బాధితురాలు వ్యభిచారం చేసేదంటూ ఆరోపించాడు. తనకు ప్రాణభయం ఉందని పోలీసులు తనను రక్షించాలని వేడుకున్నాడు. దీంతో ఈ కేసు విషయంలో పోలీసులు ఎలా ముందుకెళుతారనేది ఆసక్తికరంగా మారింది.