Late Night Sleep: ఒకప్పుడు సాయంత్రం 8 అయితే చాలు బయట ఎవరూ ఉండేవారు కాదు. నగరాలు, పట్టణాలు మినహా.. మిగతా ప్రాంతాలలో జనం త్వరగానే పడుకుండిపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి పనులు చేసుకునేవారు. యాంత్రికరణ నాడు ఆ స్థాయిలో లేదు. అందువల్ల మనుషులకు శారీరకంగా శ్రమ అధికంగా ఉండేది. నాటి కాలంలో పెద్దగా జబ్బులు కూడా వచ్చేవి కాదు. స్మార్ట్ ఫోన్ వినియోగం.. టెక్నాలజీ ఈ స్థాయిలో అభివృద్ధి అనేవి నాటి కాలంలో కనిపించేవి కాదు.
ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యాంత్రికరణ అధికమైపోయింది. టెక్నాలజీ మీద ఆధారపడడం పెరిగిపోయింది. ఫలితంగా మనిషికి సుఖం అనేది ఎక్కువైపోయింది. దీనివల్ల సకాలంలో నిద్ర అనేది కరువైపోయింది. స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో చాలామంది రాత్రి 11 దాటిన తర్వాతే పడుకుంటున్నారు. కొంతమంది అయితే తెల్లవార్లు మెలకువ తోనే ఉంటున్నారు. దీనివల్ల మెటబాలిజం పూర్తిగా దెబ్బతింటున్నది. కొందరైతే రాత్రిపూట ఉద్యోగాల వల్ల నిద్రకు చాలా వరకు దూరమవుతున్నారు.
సకాలంలో నిద్రపోకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని.. అధిక రక్తపోటు సమస్య వేధిస్తుందని.. మధుమేహం
.. హృదయ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయని చెప్తున్నారు. ఏకాగ్రత.. జ్ఞాపకశక్తి తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి.. ఆందోళన విపరీతంగా పెరిగిపోతాయని చెబుతున్నారు. సకాలంలో నిద్ర పోకపోతే జీవ క్రియలు కూడా దెబ్బతింటాయని వైద్యులు అంటున్నారు.
ఒకవేళ అనివార్య పరిస్థితిలో నిద్ర ఆలస్యంగా పోతే.. ఏడు నుంచి 8 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోవాలని.. అప్పుడే శరీరానికి విశ్రాంతి లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం నడక లేదా రన్నింగ్ చేయాలి. కొవ్వు పదార్థాలు లేని ఆహారాన్ని తీసుకోవాలి… నూనె తక్కువగా ఉండే ఆహార ప్రార్ధాలు తీసుకోవాలి. ఒత్తిడి ఏ మాత్రం లేకుండా చూసుకోవాలి.. ఇవన్నీ చేస్తే నిద్ర సులభంగా పడుతుందని.. ఎటువంటి ఇబ్బందులు లేకుండానే హాయిగా పడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు రాత్రిపూట మాంసాహారం తినకుండా.. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
