ఈ ప్రాంతంలో ఇప్పటికే పదిమంది చనిపోయారని చనిపోయిన పదిమందిలో ఎనిమిది మంది చిన్నారులు అని రచన గుప్తా తెలిపారు. ఈ గ్రామంతో పాటు పిప్రోత్లో ముగ్గురు, రాల్లో 14, జసోడాలో 17 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఆగ్రా, ఫిరోజాబాద్, మెయిన్పురి, ఎటా, కస్గంజ్ జిల్లాలలో కూడా ఈ వ్యాధి బారిన పడి చనిపోయిన వారు ఉన్నారు. అధికారులు ఆయా ప్రాంతాల ప్రజలలో లక్షణాలు కనిపిస్తే నమూనాలను సేకరిస్తున్నారు.
ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం అయితే ఉంటుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెబుతున్నారు. చిగ్గర్స్ అనే పురుగు కాటు వేయడం వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. ఎవరైతే ఈ వ్యాధి బారిన పడతారో వాళ్లకు జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు ఉంటాయి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రస్తుతం ఈ వ్యాధికి ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెబుతోంది. చెట్ల పొదలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో చిగ్గర్స్ సంచరిస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. చిన్నారులకు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.