Homeహెల్త్‌Summer Heat Hydration Tips: మండే ఎండల్లో చల్లని నీరు తాగుతున్నారా..

Summer Heat Hydration Tips: మండే ఎండల్లో చల్లని నీరు తాగుతున్నారా..

Summer Heat Hydration Tips: ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే అస్సాం వరకు ఇదే పరిస్థితి. ప్రతి ప్రాంతంలోనూ 45 కు మించిన డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎండలు పెరిగితే సహజంగానే దాహం వేస్తూ ఉంటుంది. పైగా చెమట రూపంలో శరీరం నుంచి లవణాలు బయటికి వెళ్లిపోతుంటాయి. ఇలాంటప్పుడు శరీరం డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు హైడ్రేట్ కచ్చితంగా చేసుకోవాలి. దానికోసం నీరు తాగుతూనే ఉండాలి.

ఎండాకాలంలో మామూలు నీళ్లు తాగితే దాహం తీరినట్టు అనిపించదు. పైగా గొంతు నిత్యం పొడిబారుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది చల్లటి నీళ్లను తాగుతూ ఉంటారు. చల్లని నీళ్లు తాగినప్పుడు శరీరానికి కాస్త ఉపశమనం లభించినట్టు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ దాహం వేస్తూ ఉంటుంది. చల్లని నీళ్లు తాగినప్పుడు శరీరానికి తాత్కాలికంగా సాంత్వన లభిస్తుందని.. చల్లని నీళ్లు తర్వాత శరీరానికి అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అంతర్గతంగా వేడిని క్రమబద్ధీకరించేందుకు శరీరం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. బయట వేడి అధికంగా ఉన్నప్పుడు అంతర్గతంగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు శరీరం కూల్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. దీనివల్ల మన దేహంలో ఉన్న స్వేద గ్రంధులు మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయిపోతాయి. రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. శరీరం నుంచి వేడి బయటికి వెళ్లి పోతున్నప్పుడు చర్మం లవణాలను బయటకు విడుదల చేస్తూ ఉంటుంది.. అదే సమయంలో చెమట అనేది వస్తూ ఉంటుంది. రక్త ప్రవాహంలో కూడా వేగం పెరుగుతూ ఉంటుంది. శరీరం అంతర్గతంగా కూల్ అవ్వడానికి ద్రవాలను వేగంగా కోల్పోవడం మొదలుపెడుతుంది. దీనివల్ల డిహైడ్రేషన్ అనే సమస్య ఎదురవుతూ ఉంటుంది. అంతేకాదు శరీరంలో లవణాలు బయటికి వెళ్లిపోవడం వల్ల నీరసానికి గురికావాల్సి వస్తుంది.

ఎండలో ఏదైనా పని చేసినప్పుడు.. దాహం అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు చల్లని నీళ్లు తాగితే దేహంలో ఉన్న రక్తనాళాలు ముడుచుకుపోతాయి. మైగ్రేన్ లేదా సైనస్ వంటి ఇబ్బందులు ఉన్నవారు మరింత అవస్థలు పడవచ్చు. ముఖ్యంగా పొట్ట భాగంలో కండరాలు బిగిసిపోతాయి. దీనివల్ల జీర్ణ క్రియ వేగం తగ్గే అవకాశం ఉంది.

చల్లటి నీరు తాగడం వల్ల గొంతు అంతర్గత త్వరలో అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. తెమడ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గొంతు నొప్పి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరైతే తీవ్రమైన తలపోటుకు గురవుతారు. విపరీతమైన ఎండ వల్ల బాడీలో ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు శీతలమైన నీళ్లు తాగితే శరీరం లో ఒక్కసారిగా మార్పు రావచ్చు. దానివల్ల అసౌకర్యం కూడా కలిగి అవకాశం ఉంది. టెంపరేచర్లో మార్పుల వల్ల గుండె కొట్టుకునే వేగం. ప్రభావితం కావచ్చు. అప్పుడప్పుడు కళ్ళు తిరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇలా చేస్తే ప్రయోజనం

ఎండలో తిరిగి వచ్చిన తర్వాత శరీరాన్ని కాసేపు కూల్ చేయాలి. ఆ తర్వాత నీళ్లు తాగాలి. కూల్ వాటర్ కంటే ముందుగా సాధారణ నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరం త్వరగా హైడ్రేట్ అవుతూ ఉంటుంది. అవకాశం ఉంటే కొబ్బరి నీళ్లు తాగాలి. అందులో కొంత ఉప్పు.. నిమ్మరసం.. మజ్జిగ కలిపి తాగవచ్చు. దీనివల్ల శరీరానికి అసౌకర్యం కలగదు. అంతేకాదు దేహంలో ఎలక్ట్రోలైట్లు యాక్టివ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ కూల్ వాటర్ తాగాలనుకుంటే.. ముందుగా మామూలు నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. కొంత సమయం అలా కూర్చోవాలి.. ఆ తర్వాత కూల్ వాటర్ తాగాలి.

గమనిక

ఈ కథనం పాఠకుల సమాచారం కోసం వివిధ వేదికల వద్ద సేకరించాం. ఎట్టి పరిస్థితుల్లో దీనిని వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడవద్దని ఒకే తెలుగు పాఠకులకు సూచిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular