
చలికాలంలో ఐస్ క్రీం ను కొంతమంది తింటుంటారు. ఐస్ క్రీం తిన్నప్పుడు చాలా మందికి పళ్ళు జివ్వు మానడం సహజం. అయితే ఇప్పుడు పళ్ళు జివ్వుమనని వారు కూడా ఐస్ క్రీం తినలేరు. ఐతే దీనికి కారణం చల్లదనం కాదు. పెరిగిన ధరలు. దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిన దరిమిలా ఐస్ క్రీం ధరలు పెరిగాయి. తాజాగా ఐస్ క్రీం కంపెనీలు ఐస్ క్రీం ధరలను మరింతగా పెంచాయి. ఇవి 8 నుంచి 15 శాతం వరకు పెరిగాయని సమాచారం . ఇన్పుట్ కాస్ట్ పెరిగిన కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని సదరు కంపెనీలు చెబుతున్నాయి.