Health Insurance: దేశంలో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకుంటున్నారు. కరోనా విజృంభించిన సమయంలో చాలామంది వైరస్ బారిన పడి చనిపోయారు. కరోనా సోకిన సమయంలో కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ ను వినియోగించుకుని వైద్య చికిత్స చేయించుకున్నారు. అయితే కొంతమంది అన్ని అర్హతలు ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోవడంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Also Read: తిరుపతి ఐఐటీలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు లక్ష రూపాయల వేతనంతో?
భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించినా క్లెయిమ్ ను తిరస్కరించడంతో కొంతమంది ఇబ్బందులు పడ్డారు. ప్రీమియం సరైన సమయానికి చెల్లించి క్లెయిమ్ ద్వారా డబ్బులు రాని వాళ్లు కొన్ని వివరాలను గుర్తుంచుకోవాలి. కరోనా సోకితే ఆస్పత్రిలో చేరల్సిన అవసరం లేదని క్లెయిమ్ చేయడం కుదరదని కొన్ని ఏజెన్సీలు తిరస్కరించాయి. సదరు ఏజెన్సీపై ఫిర్యాదు చేయడం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు సంబంధించిన డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఏ బీమా అయినా 30 రోజులలో క్లెయిమ్ ను పరిష్కరించి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ ను తిరస్కరిస్తే అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. దేశంలో 17 లోక్ పాల్ కేంద్రాలు ఉండగా క్లెయిమ్ ను తిరస్కరిస్తే లోక్ పాల్ కేంద్రాలలో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. www.irdai.gov.in వెబ్ సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఫిర్యాదు చేసే సమయంలో చికిత్స పత్రాలతో పాటు బిల్లులను జత చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా క్లెయిమ్ ను తిరస్కరించే అవకాశం అయితే ఉండదు.
Also Read: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండానే?