పుకార్లను నమ్మొద్దు అంటున్న యంగ్ హీరోలు

మెగా మేనల్లడు సాయి (ధరమ్)తేజ్ `ప్రతిరోజూ పండగే ` వంటి సూపర్ హిట్ సినిమా చేసాక తన తదుపరి సినిమాను దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తున్న ఈ సినిమాకి భగవాన్ పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. గత నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపు కొంది ..కాగా ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి షెడ్యూల్ వేశారు ..కాగా లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ 20 […]

Written By: admin, Updated On : April 13, 2020 1:16 pm
Follow us on


మెగా మేనల్లడు సాయి (ధరమ్)తేజ్ `ప్రతిరోజూ పండగే ` వంటి సూపర్ హిట్ సినిమా చేసాక తన తదుపరి సినిమాను దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తున్న ఈ సినిమాకి భగవాన్ పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. గత నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపు కొంది ..కాగా ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి షెడ్యూల్ వేశారు ..కాగా లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడం లేదనీ, పరిస్థితులు చక్కబడిన తరువాత షూటింగు తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు అంటున్నారు. ఇక తమ సినిమా గురించి అనవసరమైన పుకార్లు వస్తున్నాయని , తమ సినిమాకి సంబంధించిన అసలు విషయాలను తామే అధికారికంగా తెలియజేస్తామని తెలిపారు .

అదలా ఉంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్, తాను నటించిన కొత్త చిత్రం ‘రెడ్’ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల కాబోతుందని వచ్చిన వార్తని ఖండించారు .తన సినిమాని ఎట్టి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయనని , అభిమానులు కోరుకున్నట్టే థియేటర్ లో మాత్రమే విడుదల చేస్తామని అభిమానులకు భరోసా ఇచ్చాడు ఇంకా వారికి “.రామ్ పోతినేని ఎలాంటి డైలమాలో లేడు. తన అభిమానులతో కలిసి బిగ్ స్క్రీన్ పై ‘రెడ్’ చిత్రం చూసేందుకు రామ్ కూడా ఎదురు చూస్తున్నాడు” అని ట్విట్టర్ ఖాతాలో బదులిచ్చాడు .