Rajamouli: డైరెక్టర్ రాజమౌళి మరోసారి ప్రయోగత్మాక సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో విన్పిస్తోంది. ‘బాహుబలి’తో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన రాజమౌళి త్వరలోనే ఓ స్ట్రెయిట్ హిందీ చిత్రాన్ని తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించున్నారని సమాచారం.
‘బాహుబలి’ సీరిసుల నుంచే కరణ్ జోహార్ దర్శకుడు రాజమౌళి మధ్య సన్నిహిత్యం పెరిగింది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ వెనుక కూడా కరణ్ జోహర్ ఉన్నారు. బాలీవుడ్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రమోషన్స్ ను కరణ్ జోహర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈక్రమంలో వీరిమధ్య బంధం మరింత బలపడిందని తెలుస్తోంది.
Also Read: దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కు కారణమైన సిరిని శ్రీహాన్ వదిలేశాడా?
రాజమౌళితో ఓ సినిమా చేయాలని కరణ్ జోహార్ కోరగా దీనికి ఆయన సానుకూలంగా స్పందించారట. దీంతో వీరి కాంబినేషన్లో ఓ స్ట్రయిట్ హిందీ చిత్రం రాబోతుందని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి తొలి హిందీ చిత్రంగా కరణ్ జోహర్ బ్యానర్లో తెరకెక్కే మూవీ నిలిచిపోనుందట. అయితే ఈ చిత్రం పూర్తిగా ప్రయోగాత్మకంగా ఉండనుందని టాక్ విన్పిస్తోంది.
దర్శకుడు రాజమౌళి తనకు భారీ హిట్టు వచ్చిన ప్రతీసారి అభిమానుల అంచనాలను కొంతమేర తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. దీనిలో భాగంగానే ‘ఈగ’, ‘మర్యాద రామన్న’ వంటి సినిమాలు తెరకెక్కించాడు. స్టార్లు లేకుండా సైతం హిట్ కొట్టవచ్చని ఆయన నిరూపించాడు. ఈ తరహాలోనే రాజమౌళి-కరణ్ జోహర్ కాంబోలోని సినిమా ఉండనుందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే జనవరి 7న విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మరోసారి వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది.
ఇదిలా ఉంటే ‘ఆఆర్ఆర్’ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదల తర్వాత ఏదైనా గ్యాప్ దొరికితే కరణ్ జోహార్ నిర్మించే సినిమా చేసే అవకాశం ఉండనుంది. లేదంటే మహేష్ తో మూవీ చేసిన తర్వాతే ఆ మూవీ పట్టాలెక్కనుంది. ఏదిఏమైనా వీరిద్దరి కాంబినేషన్లలో సినిమా రావడం పక్కా అని తెలుస్తోంది. అయితే ఎప్పటిలోగా ఈ సినిమా వస్తుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
Also Read: నాకు నచ్చలేదు జగన్ దిగిపోతావా? దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన రాంగోపాల్ వర్మ