అక్కడ కూడా మహేశ్ బాబు ‘మైండ్‌ బ్లాక్‌’ చేస్తాడా.?

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మహేష్. అదేనండి సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మిక్స్‌డ్ తెచ్చుకున్నా.. మహేష్ బాబు తన స్టామినాతో ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం అక్కడక్కడా తేలిపోయినా.. మహేష్ బాబు […]

Written By: NARESH, Updated On : November 20, 2020 5:12 pm
Follow us on


ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మహేష్. అదేనండి సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మిక్స్‌డ్ తెచ్చుకున్నా.. మహేష్ బాబు తన స్టామినాతో ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం అక్కడక్కడా తేలిపోయినా.. మహేష్ బాబు తనదైన నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు. ఈ సినిమా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 143 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Also Read: ‘పుష్ప’తో బన్నీ స్టైల్.. ఇమేజ్ మారనుందా?

ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా  2 మిలియన్ డాలర్స్‌ను వసూళు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. మరోవైపు ఈ సినిమాతో విజయశాంతి నటిగా రీ  ఎంట్రీ ఇచ్చింది.

మహేష్ బాబుకు తమిళ మార్కెట‌్‌ను కొల్లగొట్టాలని ఎప్పట్నుంచో ఆశ. మురుగదాస్ లాంటి టాప్ డైరెక్టర్‌తో ‘స్పైడర్’ సినిమా సెట్ చేసుకుని‌ తెలుగుతో పాటు తమిళంలోనూ దాన్ని చేశాడు. కానీ ‘స్పైడర్’ సహా ఏ చిత్రమూ అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మహేష్ తమిళ మార్కెట్ గురించి ఆలోచించడం మానేశాడు.

ఐతే అతను పట్టించుకోకున్నప్పటికీ.. తన కొత్త చిత్రాన్ని తమిళంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. సంక్రాంతికి విడుదలై మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ‘ఇవనక్కు సరియాన ఆలిల్లై’ పేరుతో తమిళంలోకి అనువాదం చేశారు. లాక్ డౌన్ విరామం తర్వాత తమిళనాట ఇటీవలే థియేటర్లు తెరుచుకోగా.. ఒక స్ట్రెయిట్ మూవీ స్థాయిలో ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేస్తుండటం విశేషం.

Also Read: చిరంజీవి న్యూ లుక్ అదిరింది…

తెలుగులో మాదిరే తమిళంలో కూడా కొత్త చిత్రాలను ఇప్పట్లో రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదు. కానీ ఇటీవలే పున:ప్రారంభం అయిన థియేటర్లను ఓ మోస్తరుగా అయినా నడిపించాలంటే కొత్త సినిమాలు కావాల్సిందే. ఇదే మహేష్ సినిమాను డబ్ చేసిన నిర్మాతలకు వరమైంది. మామూలుగా అయితే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి థియేటర్లు దొరకడం కష్టం. కానీ ఇప్పుడు తెరిచిన ప్రతి థియేటర్లో ఈ సినిమాను నడిపించే అవకాశం దొరికింది.

అక్కడి స్టార్ హీరోల సినిమాల స్థాయిలో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్, విజయశాంతి, రష్మిక.. వీళ్లంతా తమిళ ప్రేక్షకులకు పరిచయమే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్