Pallavi Prashanth: బిగ్ బాస్ ద్వారా పొందిన ప్రైజ్ మనీని పల్లవి ప్రశాంత్ రైతులకు ఎప్పుడు పంచుతారు?

బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ అద్భుతమైన నటనతో తన ఆటతీరుతో రోజు రోజుకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతూ చివరికి టైటిల్ రేస్ కి చేరుకున్నారు.

Written By: Swathi, Updated On : February 19, 2024 1:48 pm
Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నవారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు. రైతు గురించి ఎమోషనల్ గా మాట్లాడుతూ.. ఈయన ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించారు. ఒక్కసారిగా పాపులర్ అయినా ఈయన ఏకంగా బిగ్ బాస్ లోకి వెళ్లారు. అన్న బిగ్ బాస్ వరకు పంపించండి అంటూ తనదైన స్టైల్ లో అడిగారు కూడా. మొత్తం మీద బిగ్ బాస్ కి వెళ్లి సీజన్ విన్నర్ గా నిలిచారు పల్లవి ప్రశాంత్.

ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ అద్భుతమైన నటనతో తన ఆటతీరుతో రోజు రోజుకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతూ చివరికి టైటిల్ రేస్ కి చేరుకున్నారు. అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ విన్నర్ కూడా అయ్యారు. అయితే ఈ కార్యక్రమం కొనసాగుతున్నప్పుడే విన్నర్ గా నిలిస్తే ఆ డబ్బును ఏం చేస్తారు అంటూ అడిగారు బిగ్ బాస్. దానికి సమాధానంగా ఒకవేళ తాను విన్ అయితే ఆ మనీని రైతులకు ఇస్తాను అని చెప్పాడు.

ఈ కార్యక్రమంలో గెలిసినందుకు పల్లవి ప్రశాంత్ కు 15 లక్షల డైమండ్ నెక్లెస్ 15 లక్షల విలువ చేసే కారు బహుమతిగా ఇచ్చారు. యావర్ 15 తీసుకొని బయటకు రావడంతో పల్లవి ప్రశాంత్ కు ప్రైజ్ మనీ కేవలం రూ. 35 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక బిగ్ బాస్ ద్వారా గెలిచిన డబ్బుతో రైతులకు సహాయం చేస్తాను అని చెప్పిన ఈయన ఇప్పటి వరకు ఆ డబ్బును రైతులకు పంచకపోవడంతో ఇచ్చిన మాట తప్పారు అంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి.

తాజాగా ఈ విమర్శలపై స్పందించారు పల్లవి ప్రశాంత్. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పను అని.. త్వరలోనే బిగ్ బాస్ ద్వారా గెలిచిన ఆ డబ్బులను రైతులకు పంచబోతున్నాను అంటూ తెలిపారు. అయితే ఈయన గెలిచిన రూ. 35 లక్షల్లో ట్యాక్స్ పోయి కేవలం తనకు రూ. 16 లక్షలు మాత్రమే వచ్చిందని.. ఆ రూ. 16 లక్షలను రైతులకు పంచబోతున్నారని టాక్.